/rtv/media/media_files/2025/02/16/StzOqg86eD76ZYJJKTo3.jpg)
Kishan Reddy Nayini Rajender Reddy
వరంగల్ పశ్చిమ నియోజకవర్గ కాంగ్రెస్ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి ఈ రోజు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డిని కలిశారు. ఈ రోజు వరంగల్ లో కిషన్ రెడ్డి పర్యటించారు. దీంతో ఏకంగా స్థానిక బీజేపీ ఆఫీసు వద్దకు వెళ్లిన ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి కిషన్ రెడ్డితో భేటీ అయ్యారు. వేయి స్తంభాల గుడి అభివృద్ధి, వరంగల్ లో వివిధ అభివృద్ధి కార్యక్రమాల కోసం కాకతీయ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీకి నిధుల కేటాయించాలని ఎమ్మెల్యే కేంద్ర మంత్రిని కోరారు. ఈ మేరకు కిషన్ రెడ్డికి వినతిపత్రం అందించారు.
కేంద్ర ప్రభుత్వం నుండి రావాల్సిన నిధులను కేటాయించాలని. స్మార్ట్ సిటీ, అటల్ మిషన్ ఫర్ రిజువనేషన్ అండ్ అర్బన్ ట్రాన్స్ఫర్మేషన్ (అమృత్ )నిధులను విడుదల చేసి నగరాభివృద్ధికి కృషి చేయాలని కోరినట్లు నాయిని రాజేందర్ రెడ్డి తెలిపారు. కేంద్ర పురావస్తు శాఖ పరిధిలో ఉన్న వేయి స్తంభాల దేవాలయ అభివృద్ధికి ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేశారు. వరంగల్ మహానగర పాలక సంస్థ అభివృద్ధికి పెండింగ్లో ఉన్న బిల్లులను త్వరగతిన ఇప్పించాలని కోరారు.