/rtv/media/media_files/B9Ee94p9I3BcH8Xpm0md.jpg)
తెలంగాణలో ఆర్టీసీ సమ్మెకు బ్రేక్ పడింది. మంత్రి పొన్నంతో చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేస్తున్నట్లు కార్మిక సంఘాలు ప్రకటించాయి. ఉద్యోగ సంఘాలతో చర్చలకు ప్రభుత్వం ముగ్గురు సీనియర్ ఐఏఎస్ అధికారులతో కమిటీ ఏర్పాటు చేసింది. లోకేష్ కుమార్, నవీన్ మిట్టల్, కృష్ణభాస్కర్ తో కూడిన కమిటీ ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. ముందుగా విడుదల చేసిన ప్రకటన ప్రకారం ఈ రోజు అర్థరాత్రి నుంచి ఆర్టీసీ కార్మికులు సమ్మెకు వెళ్లాల్సి ఉంది.
ఉద్యోగుల పెండింగ్ సమస్యలపై ఉద్యోగ సంఘాలతో చర్చించేందుకు త్రిసభ్య కమిటీ ఏర్పాటు.@TelanganaCMO @TelanganaCS pic.twitter.com/35C0YnMqI4
— Telangana Awaaz (@telanganaawaaz) May 6, 2025
కాసేపట్లో మీడియా ముందుకు..
అయితే.. ఈ సమయంలో సమ్మెకు వెళ్లడం సరికాదని ప్రభుత్వం అనేక సార్లు కార్మికులకు విజ్ఞప్తి చేసింది. కార్మికులు సంస్థకు అండగా నిలవాలని.. సమస్యల పరిష్కారానికి తాము సిద్ధమని ప్రకటిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో నేడు కార్మిక సంఘాల నేతలతో మంత్రి చర్చలు జరిపారు. చర్చలు సఫలం కావడంతో సమ్మెను వాయిదా వేశారు. దీంతో బస్సులు యథావిధిగా నడవనున్నాయి. అయితే.. మరికాసేపట్లో ఆర్టీసీ కార్మిక సంఘాల నేతలు మీడియాతో మాట్లాడి వివరాలను వెళ్లడించనున్నారు.
(telangana-news | telugu-news | telugu breaking news)