Vishnu Priya: విష్ణుప్రియకు పోలీసుల బిగ్ షాక్.. ఫోన్ సీజ్!

బెట్టింగ్ యాప్ ను ప్రమోట్ చేసిన వ్యవహారంలో ఈ రోజు పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో విష్ణుప్రియ విచారణ జరిగింది. విచారణ అనంతరం విష్ణుప్రియ ఫోన్ ను పోలీసులు సీజ్ చేశారు. ఆమె స్టేట్మెంట్ ను రికార్డు చేశారు.

New Update

బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన సెలబ్రెటీలకు తెలంగాణ పోలీసులు చుక్కలు చూయిస్తున్నారు. ఇటీవల యాంకర్ విష్ణుప్రియతో పాటు మొత్తం 11 మంది సెలబ్రెటీలకు పంజాగుట్ట పోలీసులు నోటీసులు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో విష్ణుప్రియ ఈ రోజు తన లాయర్ తో కలిసి పంజాగుట్ట పీఎస్ కు విచారణకు హాజరయ్యారు. తన అడ్వకేట్‌తో కలిసి ఆమె విచారణకు హాజరయ్యారు. ముఖం కనిపించకుండా తలకు స్కార్ఫ్ తో విష్ణుప్రియ విచారణకు హాజరయ్యారు. విష్ణు ప్రియ మొబైల్ ను పోలీసులు సీజ్ చేశారు. బెట్టింగ్ యాప్ నిర్వాహకులతో ఆమె ఏం మాట్లాడారు? వారి మధ్య ఎలాంటి సంప్రదింపులు, లావాదేవీలు జరిగాయి? అన్న కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 

ఒక్కో వీడియోకు రూ.90 వేలు..

కొద్ది సేపటి క్రితం విష్ణుప్రియ పోలీసు విచారణ పూర్తైంది. విచారణలో తాను బెట్టింగ్‌ యాప్స్ ను ప్రమోట్ చేసినట్లు విష్ణుప్రియ ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. ఒక్కో వీడియోకు రూ.90 వేలు తీసుకున్నట్లు పోలీసులకు ఆమె వివరించినట్లు సమాచారం. ఇలా మొత్తం 15 బెట్టింగ్‌ యాప్స్ ను విష్ణప్రియ ప్రమోట్ చేసినట్లు పోలీసులు గుర్తించినట్లు వార్తలు వస్తున్నాయి.
ఇది కూడా చదవండి: Pareshan Boys Imran: బెట్టింగ్ యాప్స్ కేసు.. అడ్డంగా దొరికిపోయిన పరేషాన్ బాయ్స్ ఇమ్రాన్- వీడియో వైరల్!

బెట్టింగ్ ప్రమోషన్లకు బ్లాక్ మనీ?

బెట్టింగ్ యాప్ ప్రమోషన్లు చేసిన వారికి రెమ్యూనరేషన్ ఎలా ఇచ్చారు? అన్న అంశంపై కూడా తీవ్రంగా చర్చ సాగుతోంది. బ్లాక్ మనీ ఇచ్చారా? లేదా క్యాష్ ఇచ్చారా? అన్న కోణంలో విచారణ సాగుతోంది. హవాలా రూపంలో ఏమైనా చెల్లింపులు జరిగాయా? అన్న వివరాలు సైతం పోలీసులు సేకరిస్తున్నట్లు తెలుస్తోంది. లావాదేవీల్లో అవకతవకలు జరిగిన్లు ఏ మాత్రం ఆధారాలు లభించినా.. ఈడీ కూడా ఎంటర్ అవుతుంది. అప్పుడు కేసు మరింత జఠిలం అయ్యే అవకాశం ఉంది.  
ఇది కూడా చదవండి: Hydra Behavior: హైడ్రాకు మరో సారి హైకోర్టు చురకలు.. ‘మీ టార్గెట్ వాళ్లేనా..?’

స్టార్ హీరోలపై కూడా కేసులు..

ఇదిలా ఉంటే.. బెట్టింగ్ యాప్ కేసులో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. టాలీవుడ్ స్టార్ హీరోలు, హీరోయిన్లపై మియాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. విజయ్‌దేవరకొండ, రానా దగ్గుబాటి, ప్రకాశ్‌రాజ్, నిధి అగర్వాల్, మంచులక్ష్మి, అనన్య నాగల్ల, ప్రణీత, శ్రీముఖి, సిరి హనుమంతు, నయని పావనిపై కేసు నమోదు చేశారు. బాలీవుడ్ సెలబ్రెటీలతో పాటు మొత్తం 25 మందిపై కేసులు నమోదు చేయడం సంచలనంగా మారింది. 

( telugu-news | vishnu-priya | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
తాజా కథనాలు