Telangana New DGP: కొత్త పోలీస్ బాస్ శివధర్ రెడ్డి.. సర్వీస్ హిస్టరీ తెలిస్తే షాక్!

తెలంగాణ పోలీస్ బాస్‌గా రాష్ట్ర ప్రభుత్వం IPS శివధర్ రెడ్డిని నియమించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఆయనకు శుక్రవారం నియామక పత్రం అందించారు. ఆయన 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 2016లో గ్యాంగ్‌స్టర్ నయీం ఎన్కౌంటర్‌లో శివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు.

New Update
Shivdhar Reddy is the new DGP of Telangana

తెలంగాణ పోలీస్ బాస్‌గా రాష్ట్ర ప్రభుత్వం IPS శివధర్ రెడ్డిని నియమించింది. ఈమేరకు ముఖ్యమంత్రి ఆయనకు శుక్రవారం నియామక పత్రం అందించారు. ఆయన 1994 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారి. 2016లో గ్యాంగ్‌స్టర్నయీంఎన్కౌంటర్‌లోశివధర్ రెడ్డి కీలక పాత్ర పోషించారు. ఎన్‌కౌంటర్ ఆపరేషన్ ప్లాన్ చేసింది ఈయనే. పోలీస్ డిపార్ట్‌మెంట్ శివధర్ రెడ్డి సేవలకు ఎన్నో అవార్డు సొంతం చేసుకున్నారు.

హైదరాబాద్‌లో పుట్టి పెరిగిన శివధర్ రెడ్డి రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం తూలేకలాన్ (పెద్దతుండ్ల) గ్రామానికి చెందిన వారు. ప్రైమరీ స్కూల్ నుంచి ఉన్నత విద్య వరకు హైదరాబాద్‌లో చదువుకున్నారు. ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ పూర్తి చేసి కొంతకాలం అడ్వకేట్‌గా ప్రాక్ట్రీస్ చేశారు. తర్వాత శివధర్ రెడ్డి సివిల్ సర్వీసెస్ క్లియర్‌ చేసి 1994లో ఇండియన్ పోలీస్ సర్వీస్‌లో చేరారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ASPగా విశాఖపట్నంలోని అనకాపల్లి, నర్సీపట్నం, చింతపల్లిలో పని చేశారు. గ్రేహౌండ్స్‌ స్క్వాడ్రన్ కమాండర్‌గా‌, బెల్లంపల్లి, ఆదిలాబాద్, నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు జిల్లాల ఎస్పీగా కూడా సేవలందించారు. శివధర్ రెడ్డి DIG SIBగా మావోయిస్టుల అణిచివేతలో కీలక పాత్ర పోషించారు. 2014-2016 మధ్యన తెలంగాణ రాష్ట్రానికి మొదటి ఇంటలిజెన్స్ చీఫ్‌గా పని చేశారు. 

ఐక్యరాజ్యసమితి శాంతిపరిరక్షక దళంలో భాగంగా యునైటెడ్ నేషన్స్ మిషన్ ఇన్ కొసావో లో కూడా శివధర్ రెడ్డి సేవలు అందించారు. నల్గొండ, శ్రీకాకుళం, నెల్లూరు, గుంటూరు ఎస్పీగా పని చేస్తున్న సమయంలో అనేక సెన్సేషనల్ కేసులను ఛేదించారు. 2007లో మక్కా మసీదులో బాంబు పేలుళ్లు, పోలీసు కాల్పుల్లో 14 మంది చనిపోయిన సంఘటన తర్వాత హైదరాబాద్ సౌత్ జోన్ డిసిపిగాశివధర్ రెడ్డిని నియమించింది ప్రభుత్వం. అత్యంత ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడిన ఆ సమయంలో రాత్రి పగలు శ్రమించి, అన్ని వర్గాల ప్రజలలో ధైర్యం నింపి శాంతి భద్రతలను సమర్థంగా కాపాడారు. విశాఖపట్నం పోలీస్ కమిషనర్‌గా పనిచేసినప్పుడు రోడ్ భద్రత కోసం Arrive Alive క్యాంపెయిన్ నిర్వహణించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో ఏసీబీ అడిషనల్ డైరెక్టర్‌గా, డైరెక్టర్‌గా నియమితులైయ్యారు. పర్సనల్ వింగ్‌లో ఐజి, అడిషనల్ డీజీగా బాధ్యతలు చేపట్టారు. 2023లో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటెలిజెన్స్ చీఫ్‌గా మళ్ళీ శివధర్ రెడ్డి నియామకమైయ్యారు. ఆగస్టు 2024లో డీజీపీగా ప్రమోషన్ పొందారు. గ్యాలంట్రీ మెడల్, పోలీస్ మెడల్, ప్రెసిడెంట్ మెడల్, ఐక్యరాజ్యసమితి మెడల్ సహా అనేక అవార్డులు శివధర్ రెడ్డి అందుకున్నారు.

Advertisment
తాజా కథనాలు