విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కలిపిన గ్రామాల్లో ఐదింటిని తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ఫురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గడ్ సీలఎంతో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని కోరారు. ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.
కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందన్నారు. లేదంటే అన్ని గ్రామాలు మునిగిపోతాయన్నారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందన్నారు. దేవుడి మాన్యం ఆంధ్రాకి పోయింది.. దేవుడేమో తెలంగాణలో ఉన్నాడన్నారు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందన్నారు. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలన్నారు.
అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం
ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. 2014లో ప్రధాని మోదీ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ ను ఆమోదించి అన్యాయం చేశారన్నారు. లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీ అప్పజెప్పారని ధ్వజమెత్తారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీసుకున్నారని ఆరోపించారు.
ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంటులో తాము గళమెత్తామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులం పార్లమెంటులో మాట్లాడాము కానీ కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఆ నాడు కూడా పట్టనట్టు వ్యవహరించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ బంద్ కు పిలుపునిచ్చినా కేంద్రానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందన్నారు.
చంద్రబాబువి బ్యాక్ డోర్ పాలిటిక్స్.. రాముడి మాన్యాలు ఏపీలో.. కవిత సంచలన వ్యాఖ్యలు!
ఏపీ సీఎం చంద్రబాబు బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి తెలంగాణలోని ఏడు మండలాలు దక్కించుకున్నాడని కవిత ధ్వజమెత్తారు. ఏపీలో కలిపిన గ్రామాల్లో ఐదింటిని తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందన్నారు.
విభజన సమయంలో ఆంధ్రప్రదేశ్ లో కలిపిన గ్రామాల్లో ఐదింటిని తిరిగి తెలంగాణకు ఇవ్వాలని ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు. ఈ రోజు తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో కవిత మాట్లాడుతూ.. ఫురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ నెల 25న ప్రగతి ఎజెండా పేరిట ఏపీ, తెలంగాణ, ఒడిశా, చత్తీస్ గడ్ సీలఎంతో ప్రధాని మోదీ నిర్వహిస్తున్న సమావేశంలో ఈ అంశాన్ని చర్చించాలని కోరారు. ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని డిమాండ్ చేశారు.
కరకట్టల ఎత్తు పెంచుకుంటేనే భవిష్యత్తులో కూడా ఐదు గ్రామాలకు రక్షణ ఉంటుందన్నారు. లేదంటే అన్ని గ్రామాలు మునిగిపోతాయన్నారు. పోలవరం వల్ల భద్రాచలం ప్రాంతానికి శాశ్వత ముంపు ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీలో కలిపిన పురుషోత్తపట్నంలో భద్రాచలం రాములవారి మాన్యం వెయ్యి ఎకరాలు ఉందన్నారు. దేవుడి మాన్యం ఆంధ్రాకి పోయింది.. దేవుడేమో తెలంగాణలో ఉన్నాడన్నారు. అక్కడ పట్టించుకునే పరిస్థితి లేక దేవుడి మాన్యం అన్యాక్రాంతమవుతోందన్నారు. దేవుడి మాన్యాన్ని పరిరక్షించాలని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నానన్నారు. పోలవరం ముంపుపై సంయుక్త సర్వే నిర్వహించాలన్నారు.
అవసరమైతే న్యాయ పోరాటం చేస్తాం
ఉమ్మడి రాష్ట్రంలో పోలవరం ప్రాజెక్టును ఆపే ప్రయత్నంలో తెలంగాణ జాగృతి సుప్రీం కోర్టును ఆశ్రయించిందని గుర్తు చేశారు. 2014లో ప్రధాని మోదీ మొట్టమొదటి కేబినెట్ సమావేశంలోనే ఏడు మండలాలను ఏపీలో కలపడానికి ఆర్డినెన్స్ ను ఆమోదించి అన్యాయం చేశారన్నారు. లోయర్ సిలేరు విద్యుత్తు ప్రాజెక్టును కూడా ఏపీ అప్పజెప్పారని ధ్వజమెత్తారు. బ్యాక్ డోర్ పాలిటిక్స్ చేసి చంద్రబాబు ఏడు మండలాలను తీసుకున్నారని ఆరోపించారు.
ఇది విభజన చట్టానికి, రాజ్యాంగ స్పూర్తికి వ్యతిరేకమని అప్పుడే పార్లమెంటులో తాము గళమెత్తామని గుర్తు చేశారు. బీఆర్ఎస్ పార్టీ సభ్యులం పార్లమెంటులో మాట్లాడాము కానీ కాంగ్రెస్ సభ్యులు మాత్రం ఆ నాడు కూడా పట్టనట్టు వ్యవహరించారని ఫైర్ అయ్యారు. కేసీఆర్ బంద్ కు పిలుపునిచ్చినా కేంద్రానికి చీమకుట్టినట్టుగా కూడా లేదన్నారు. పోలవరం స్పిల్ వే సామర్థ్యాన్ని 50 లక్షల క్యూసెక్కులకు పెంచుకోవడం వల్ల తెలంగాణకు బ్యాక్ వాటర్ సమస్య ఏర్పడుతుందన్నారు.