/rtv/media/media_files/2025/04/28/oUjNhCJKqUdZdfbFRRIR.jpg)
Raghunadan Rao
పేద విద్యార్థులకు ఉచితంగా విద్యను అందిస్తున్న ఫాతిమా కాలేజీని కూల్చే ఆలోచన లేదంటూ హైడ్రా చీఫ్ రంగనాథ్ చేసిన వ్యాఖ్యలపై మెదక్ ఎంపీ రఘునందన్ రావు ఫైర్ అయ్యారు. FTLలో ఉన్న ఏ నిర్మాణమైనా కూల్చాల్సిందేనన్నారు. ఈ క్రమంలో ఫాతిమా కాలేజీని కూడా కూల్చాల్సిందేనన్నారు. ఎంపీలు అసదుద్దీన్, అక్బరుద్దీన్ ఎవరైనా చట్టం ముందు సమానమేనన్నారు. ఫాతిమా కాలేజీ కూల్చడానికి హైడ్రా రంగనాథ్కు ఏదైనా ఇబ్బంది ఉండొచ్చు కానీ తాము విడిచిపెట్టమన్నారు. ఫాతిమా కాలేజీని కూల్చేదాకా న్యాయస్థానాల్లో పోరాడుతామన్నారు.