తెలంగాణలో వరదబాధితులకు రిలయన్స్ భారీ సాయం

తెలంగాణలో వరదబాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల భారీ సాయం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫౌండేషన్ సభ్యులు ఈ మేరకు చెక్కును అందించారు. ప్రభుత్వానికి అండగా నిలిచిన రిలయన్స్ ఫౌండేషన్ ను రేవంత్ అభినందించారు.

Reliance Foundation Neetha Ambani
New Update

వరద బాధితుల సహాయార్థం తెలంగాణ ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి సహాయ నిధికి విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు సీఎం రేవంత్ రెడ్డిని కలిసి విరాళాలు అందిస్తున్నారు. తాజాగా రిలయన్స్ ఫౌండేషన్ తెలంగాణ ముఖ్యమంత్రి సహాయనిధికి రూ.20 కోట్ల భారీ విరాళం ప్రకటించింది.

అభినందించిన రేవంత్

ఈ మొత్తాన్ని రియలన్స్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ నీతా ఎం. అంబానీ తరఫున పలువురు ప్రతినిధులు రేవంత్ రెడ్డికి ఈ రోజు అందించారు. వరద బాధితులను ఆదుకోవడంలో ప్రభుత్వానికి అండగా నిలిచినందుకు రిలయన్స్ ఫౌండేషన్ ను అభినందించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. 

#reliance #telangana-floods #cm-revanth-reddy
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి