తెలంగాణలో వరదబాధితులకు రిలయన్స్ భారీ సాయం
తెలంగాణలో వరదబాధితుల కోసం రిలయన్స్ ఫౌండేషన్ రూ.20 కోట్ల భారీ సాయం ప్రకటించింది. సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ఫౌండేషన్ సభ్యులు ఈ మేరకు చెక్కును అందించారు. ప్రభుత్వానికి అండగా నిలిచిన రిలయన్స్ ఫౌండేషన్ ను రేవంత్ అభినందించారు.
Kumari Aunty: వరద బాధితులకు కుమారి ఆంటీ సహాయం.. రూ. 50000 విరాళం!
తెలంగాణ వరద బాధితులకు తన వంతు సహాయం చేసేందుకు కుమారి ఆంటీ ముందుకొచ్చారు. వరదల్లో నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు రూ. 50000 విరాళాన్ని ఇచ్చారు. ఇందుకు సంబంధించిన చెక్కును కుమారి ఆంటీ స్వయంగా సీఎం రేవంత్ రెడ్డికి అందించారు.
Chiranjeevi: వరద బాధితుల కోసం సీఎం రేవంత్ రెడ్డికి రూ. కోటి చెక్కు!
మెగాస్టార్ చిరంజీవి తెలంగాణ వరద బాధితులను ఆదుకునేందుకు ముఖ్యమంత్రి సహాయనిధికి తన వంతు విరాళం అందించారు. నేడు సీఎం రేవంత్ రెడ్డిని ఆయన నివాసంలో స్వయంగా కలిసి రూ. కోటి చెక్కును అందజేశారు. రామ్ చరణ్ తరపున 50 లక్షలు, ఆయన తరుపున 50 లక్షలు ఇచ్చారు.
Telangana Floods: ఈ నెల 11న తెలంగాణకు కేంద్ర బృందం రాక
అకాల వర్షాలతో అతలాకుతలం అయిన తెలంగాణలోని వరద ప్రాంతాల్లో నష్టాన్ని అంచనా వేసేందుకు కేంద్రం నుంచి ఒక బృందం రానుంది. కల్నల్ కీర్తి ప్రతాప్ సింగ్ నేతృత్వంలోని 6 గురు సభ్యుల కేంద్ర బృందం 11 సెప్టెంబర్ నాడు తెలంగాణలోని ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాలు సహా.. వరద కారణంగా ప్రభావితమైన ప్రాంతాల్లో పర్యటించనున్నాయి.
Badrachalam: మళ్లీ ఉగ్రరూపం దాలుస్తున్న గోదావరి
భద్రాచలం వద్ద ప్రమాదకరస్థాయికి నీటిమట్టం చేరింది. నీటిమట్టం 43 అడుగుల స్థాయికి చేరింది. మరికాసేపట్లో అధికారులు మొదటి ప్రమాద హెచ్చరికను ప్రకటించే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేశారు అధికారులు.
Floods in Telugu States: వరదల ఎఫెక్ట్.. తెలుగు రాష్ట్రాలకు కేంద్రం భారీ ఆర్థిక సాయం
భారీ వర్షాల వల్ల వరదలతో కుదేలైన తెలుగు రాష్ట్రాలకు కేంద్ర ప్రభుత్వం భారీ సాయం ప్రకటించింది. తక్షణ సాయంగా తెలంగాణ, ఏపీకి కలిపి రూ.3,300 కోట్లు విడుదల చేసింది. కేంద్రమంత్రి శివరాజ్ చింగ్ చౌహాన్ తెలుగు రాష్ట్రాల్లోని వరద ప్రభావిత ప్రాంతంలో పర్యటించిన సంగతి తెలిసిందే.
Flood Disaster : రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం.. వరద బాధితులకు ఇందిరమ్మ ఇండ్లు!
రేవంత్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు, వరదల వల్ల ఇళ్లు కూలిపోయిన వారికి ప్రాధాన్యత కింద మొదటి విడతలో ఇందిరమ్మ ఇళ్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ఇప్పటివరకు రాష్ట్రంలో 7వేల ఇల్లు నేలమట్టం అయినట్లు కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక ఇచ్చారు.
Telangana: వరద బాధితులకు విద్యుత్ శాఖ ఉద్యోగులు భారీ విరాళం
వరద బాధితులను ఆదుకునేందుకు సీఎం రిలీఫ్ ఫండ్కు విరాళాలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా విద్యుత్ శాఖ ఉద్యోగులు తమ ఒక రోజు మూలవేతనం విరాళంగా ఇస్తున్నట్లు ప్రకటన చేశారు. అన్ని స్థాయిల ఉద్యోగులు, పింఛనర్లతో కలిపి రూ.15 కోట్లు అందించనున్నట్లు విద్యుత్ ఉద్యోగుల జేఏసీ తెలిపింది.