BIG BREAKING: బీఆర్ఎస్ కీలక నేత మృతి.. కేసీఆర్ సంతాపం!

అశ్వారావుపేట నియోజక వర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక కార్యకర్త, ఉమ్మడి జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు నాగమణి ఈ రోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగమణి మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

New Update
KCR 2

అశ్వారావుపేట నియోజక వర్గానికి చెందిన బీఆర్ఎస్ పార్టీ వ్యవస్థాపక కార్యకర్త, ఉమ్మడి జిల్లా మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలు నాగమణి ఈ రోజు మృతి చెందారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ నాగమణి మరణం పట్ల సంతాపం ప్రకటించారు.

ప్రారంభ కాలం నుంచి పార్టీకి నాగమణి చేసిన సేవలను, ఉద్యమంలో ఆమె చేసిన కృషిని స్మరించుకున్నారు. నాగమణి కుటుంబ సభ్యులకు కేసీఆర్ తన ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఆమె కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసానిచ్చారు. ఈ మేరకు ప్రకటన విడుదల చేశారు.

కేసీఆర్ తో కేటీఆర్ భేటీ!

ఇదిలా ఉంటే.. సిద్దిపేట జిల్లాలోని ఎర్రవల్లి ఫాంహౌస్‌లో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్‌తో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్‌, కీలక నేతలు హరీష్‌రావు, వినోద్‌కుమార్‌ భేటీ అయ్యారు. ఈ నెల 14న కరీంనగర్‌లో నిర్వహించ తలపెట్టిన బీసీ సభ ఏర్పాట్లపై వీరు చర్చించారు. కాళేశ్వరం ప్రాజెక్ట్ రిపోర్ట్, కవిత వ్యవహారంపై సైతం వీరు చర్చించినట్లు తెలుస్తోంది. 

Advertisment
తాజా కథనాలు