తిరగబడ్డ గిరిజనులు.. ఏటూరునాగారం అడవుల్లో హైటెన్షన్!

ఏటూరు నాగారంలో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. గుడిసెలను తొలగించేందుకు ప్రయత్నించిన ఫారెస్ట్, పోలీసు అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ క్రమంలో పలువురు పోలీసులు, అటవీశాఖ అధికారులకు గాయాలైనట్లు తెలుస్తోంది.

New Update

ములుగు జిల్లా  వాతావరణం నెలకొంది. చల్లాక అటవీ భూముల్లో గిరిజనులు గుడిసెలు వేసుకున్నారు. వాటిని తొలగించేందుకు అటవీశాఖ అధికారులు, పోలీసులు భారీఎత్తున మొహరించారు. రిజర్వ్ ఫారెస్ట్‌లో గుడిసెలు వేసుకున్నారని చెబుతున్న అటవీశాఖ, పోలీసులు వాటిని తొలిగించే ప్రయత్నం చేశారు. దీంతో పోలీసులు, అటవీశాఖ అధికారులపై గిరిజనులు తిరగబడ్డారు. ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం, తోపులాట చోటు చేసుకుంది. కారంపొడి, కర్రలతో గిరిజనులు ఎదురుదాడికి దిగారు. ఈ దాడిలో పలువురు పోలీసులు, అటవీశాఖ అధికారులకు గాయాలయ్యాయి. 

Advertisment
తాజా కథనాలు