TG: హుస్సేన్‌సాగర్‌లో గణేష్ నిమజ్జనాలకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌

హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనాలు చేసేందుకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నిమజ్జనాలు జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పటిషన్‌ సరికాదని కోర్టు పేర్కొంది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది.

author-image
By B Aravind
New Update
Ganesh

తెలంగాణ హైకోర్టు కీలక తీర్పునిచ్చింది. హైదరాబాద్ హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాలు నిమజ్జనం చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. అయితే ఇటీవల హుస్సేన్‌సాగర్‌లో గణేష్ విగ్రహాల నిమజ్జనం చేయకూడదని హైకోర్టులో లాయర్ వేణుమాధవ్‌ పిటిషన్ దాఖలు చేశారు. గతంలో నిమజ్జనాలు చేయొద్దని హైకోర్టు ఇచ్చిన ఆదేశాలనే అమలు చేయాలని కోరారు. ఇందుకోసం హైడ్రాను కూడా పిటిషనర్‌గా ప్రతివాదిగా చేర్చాలని అభ్యర్థించారు. అయితే ఈ పిటిషన్‌పై మంగళవారం ధర్మసనం విచారణ చేపట్టింది.  

ధిక్కరణ పటిషన్‌ సరికాదు

ముందుగా హైడ్రాను ప్రతివాదిగా చేర్చడాన్ని కోర్టు తిరస్కరించింది. ఆ తర్వాత పిటిషనర్‌ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. హుస్సేన్‌సాగర్‌లో వినాయక విగ్రహ నిమజ్జనాలు చేసేందుకు పర్మిషన్ ఇచ్చింది. అయితే కోర్టు ధిక్కరణపై పిటిషనర్‌ సరైన ఆధారాలు చూపించలేకపోయారు. దీంతో నిమజ్జనాలు జరుగుతున్న చివరి సమయంలో ధిక్కరణ పటిషన్‌ సరికాదని కోర్టు పేర్కొంది. 2021 ఆదేశాల ప్రకారం గణేష్ నిమజ్జనం చేయాలని స్పష్టం చేసింది. గత ఆదేశాల సమయంలో హైడ్రా లేదని.. అలాంటప్పుడు ఇప్పుడెలా హైడ్రాను పార్టీ చేస్తామని ప్రశ్నించింది. అధికారుల చర్యలను సమర్థించింది. 

అలాగే పీఓపీతో విగ్రహాలు తయారు చేయడంపై నిషేధం ఇవ్వలేమని.. పీఓపీ విగ్రహాలు తాత్కాలిక పాండ్స్‌లలో నిమజ్జనం చేసుకోవచ్చని తెలిపింది. పిటిషనర్ ప్రత్యేక ఆదేశాల కోసం రిట్ పిటిషన్‌ కూడా వేయొచ్చని ధర్మాసనం తేల్చిచెప్పింది. ఇదిలాఉండగా.. ఈ వ్యవహారంపై కోర్టులో విచారణ జరుగుతుండగా హుస్సేన్‌సాగర్‌లో వినాయన నిమజ్జనాలకు పర్మిషన్ లేదంటూ పోలీసులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. సాగర్‌లో గణేష్ నిమజ్జనం చేయకుండా ఇనుప కంచెలు కూడా ఏర్పాటు చేశారు. 

Advertisment
తాజా కథనాలు