/rtv/media/media_files/2025/03/17/3PqsbSq76BCVAuh5Guri.jpg)
Rajiv Yuva Vikasma Scheme
తెలంగాణలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ యువతకు స్వయం ఉపాధి కల్పించడం కోసం రాజీవ్ యువ వికాసం స్కీమ్ను రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది. సోమవారం నుంచి ఈ స్కీమ్కు కింద దరఖాస్తులు స్వీకరించనుంది. సీఎం రేవంత్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, అలాగే బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ఈ దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభించనున్నారు. అభ్యర్థుల నుంచి ఏప్రిల్ 5వ తేదీ వరకు ఆయా సంక్షేమ శాఖలు ఆన్లైన్లో దరఖాస్తులు స్వీకరించనున్నాయి.
Also Read: ప్రేమను పెద్దలు అంగీకరించరేమోనని..వారిద్దరూ ఏం చేశారంటే?
రాష్ట్రంలో దాదాపు 5 లక్షల మంది ఉపాధి కల్పించాలని రేవంత్ సర్కార్ భావిస్తోంది. ఇందుకోసం రూ.6 వేల కోట్లకు పైగా నిధులు ఖర్చు చేసేందుకు సిద్ధమైంది. యువతకు స్వయం ఉపాధి కల్పించేందుకు ఎస్సీ ఆర్థిక సహకార సంస్థ రూ.1200 కోట్లు, అలాగే గిరిజన ఆర్థిక సహకారం సంస్థ రూ.360 కోట్లతో కార్యాచరణ ప్లాన్ను రూపొందించాయి. ఇక బీసీల్లో అత్యధిక మందికి లబ్ధి చేకూర్చేందుకు బీసీ కార్పొరేషన్ ప్రణాళికను తయారుచేసింది. మొదటి ఏడాదిలోనే 1.5 లక్షల మందికి స్వయం ఉపాధి కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటికోసం ఇప్పటికే బడ్జెట్లో కోటాయించిన రూ.2 వేల కోట్లు అందుబాటులోనే ఉన్నాయి.
Also Read: శాంతి కోసం ప్రయత్నిస్తే..పాక్ నమ్మకం ద్రోహం చేసింది-ప్రధాని మోదీ
రాజీవ్ యువ వికాసం స్కీమ్ కింద లబ్ధిదారులకు ప్రయోజనం కోసం యూనిట్ల విలువ ఆధారంగానే ప్రభుత్వం రుణాలను మూడు కేటగిరీలుగా విభజన చేసింది. ఇందులో కేటగిరి 1 కింద రూ.లక్ష వరకు లోన్ వస్తుంది. ఇందులో 80 శాతం రాయితీ ఉంటుంది. కేటగిరి 2 కింద రూ.లక్ష నుంచి రూ.2 లక్షల వరకు రుణాలు అందిస్తుంది. ఇందులో 70 శాతం రాయితీ ఉంటుంది. ఇక కేటగిరి 3 కింద రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షల లోపు లోన్ ఇవ్వనుంది. ఇందులో 60 శాతం వరకు రాయితీ ఉంటుంది.
Also Read: కుల వివక్షపై కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ కీలక వ్యాఖ్యలు