/rtv/media/media_files/2025/06/24/supreme-court-2025-06-24-21-31-15.jpg)
Supreme Court
Telangana government: బీసీ రిజర్వేషన్ల పై తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. బీసీ రిజర్వేషన్లకు సంబంధించిన జీవో 9పై తెలంగాణ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వుల జారీ చేయడంతో రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించనుంది. హైకోర్టు తీర్పును స్టడీ చేసిన ప్రభుత్వం సీనియర్ కౌన్సిల్తో సుప్రీంలో వాదనలు వినిపించాలని సీఎం రేవంత్ రెడ్డి నిర్ణయం తీసుకున్నారు. అభిషేక్ మను సింగ్వి, సిద్ధార్థ దవే వంటి రిజర్వేషన్లపై ప్రావీణ్యం కలిగిన అడ్వకేట్లతో వాదనలు వినిపించాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం.
Also Read : వీడు కోచ్ కాదు...కామాంధుడు..వాలీబాల్ కోచ్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య
కాగా హైకోర్టు జీవో 9పై స్టే విధిస్తూ, 2 వారాల్లో పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తాజాగా బీసీ రిజర్వేషన్ల పై హైకోర్టు ఆర్డర్ కాపీ వెలువడింది. ఈ కాపీ ప్రకారం జీఓ 9, 41, 42 ల పై హైకోర్టు స్టే విధించింది. ట్రిపుల్ టెస్టు పాటించకపోవడం పై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం 50 శాతం రిజర్వేషన్లు మించి ఉండడాన్ని తప్పుబట్టింది. తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది. వికాస్ కృష్టా రావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో సుప్రీంకోర్టు తీర్పులను హైకోర్టు పరిగణలోకి తీసుకున్నది.
Also Read : వీడు కోచ్ కాదు...కామాంధుడు..వాలీబాల్ కోచ్ వేధింపులు..విద్యార్థిని ఆత్మహత్య
కాగా హైకోర్టు జీవో 9పై స్టే విధిస్తూ, 2 వారాల్లో పిటిషనర్లు కౌంటర్ దాఖలు చేయాలని, అలాగే 4 వారాల్లో ప్రభుత్వం కౌంటర్ దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణను 4 వారాలకు వాయిదా వేసింది. తాజాగా బీసీ రిజర్వేషన్ల పై జీఓ 9, 41, 42 లపై హైకోర్టు ఆర్డర్ కాపీ వెలువడింది. అందులో ట్రిపుల్ టెస్టు పాటించకపోవడంపై హైకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. సుప్రీం కోర్టు నిబంధనల ప్రకారం.. 50 శాతం రిజర్వేషన్లు పరిమితి మించరాదని స్పష్టం చేసింది. తదుపరి విచారణ డిసెంబర్ 3 కు వాయిదా వేసింది. వికాస్ కృష్టారావు గవాలి, రాహుల్ రమేష్ వాగ్ కేసుల్లో ధర్మాసనం తీర్పులను హైకోర్టు పరిగణలోకి తీసుకున్న విషయం తెలిసిందే.
Also Read: Italy: ఆ దేశంలో బురఖా, నిఖాబ్ ధరించకూడదు..ప్రభుత్వ సంచలన నిర్ణయం