/rtv/media/media_files/2025/04/22/2C9ryOZgIYNRTAV5MlPn.jpg)
Telangana Jobs CM Revanth Japan Tour
ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి నేతృత్వంలో తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ లో చేపట్టిన పర్యటన ఈ రోజుతో ముగిసింది. సీఎం రేవంత్ టీమ్ రేపు హైదరాబాద్ కు తిరిగి రానుంది. ఈ పర్యటనలో మొత్తం రూ.12,062 కోట్ల పెట్టుబడులను రాష్ట్రానికి తీసుకురావడానికి ఒప్పందాలు జరిగాయి. దీంతో దాదాపు 30,500 మందికి ఉద్యోగాలు లభించనున్నాయి. కంపెనీల వారీగా లభించిన పెట్టుబడుల వివరాలు ఇలా ఉన్నాయి.
జాపాన్లోని హిరోషిమా స్థానిక ప్రభుత్వం - తెలంగాణ రాష్ట్రాల మధ్య పలు రంగాల్లో భాగస్వామ్యం, సహకారం దిశగా కీలక చర్చలు జరిగాయి. ముఖ్యమంత్రి @revanth_anumula గారి నేతృత్వంలోని ప్రతినిధి బృందం హిరోషిమా ప్రిఫెక్చర్ వైస్ గవర్నర్ మికా యొకోటా (Mika Yokota) గారితో సమావేశమై పలు అంశాలను… pic.twitter.com/rnI536tAf1
— Telangana CMO (@TelanganaCMO) April 22, 2025
మారుబెని:
హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు ఒప్పందం జరిగింది. రూ.1,000 కోట్లు ప్రారంభ పెట్టుబడి కాగా రూ.5,000 కోట్ల పెట్టుబడుల అంచనా అని అధికారులు తెలిపారు. తద్వారా 30,000 ఉద్యోగాలు లభించనున్నట్లు చెప్పారు.
ఎన్టీటీ డేటా, నెయిసా:
హైదరాబాద్లో అర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ డేటా సెంటర్ క్లస్టర్ ఏర్పాటుకు ఒప్పందం చేసుకున్నారు. దీంతో రూ.10,500 కోట్ల పెట్టుబడులు లభించనున్నాయి.
🔸 Hon’ble Chief Minister of #Telangana Shri @revanth_anumula garu, led the official #TelanganaRising delegation to set the ball rolling for the national contingent at the Osaka Expo.
— Telangana Digital Media Wing (@DigitalMediaTG) April 21, 2025
✅ జపాన్లోని ఒసాకాలో జరుగుతున్న ప్రతిష్టాత్మక ఒసాకా ఎక్స్పోలో #తెలంగాణ రాష్ట్రం తన… pic.twitter.com/4A8m7GKVAw
తోషిబా ట్రాన్స్ మిషన్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్ ఇండియా (TTDI):
రుద్రారంలో విద్యుత్ పరికరాలు, సామాగ్రి తయారీ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయనున్నారు. మొత్తం రూ.562 కోట్ల పెట్టుబడులతో ఈ కంపెనీని ఏర్పాటు చేయనున్నారు.
టామ్ కామ్ (TOMCOM) తో టెర్న్, రాజ్ గ్రూప్:
జపాన్లో 500 ఉద్యోగ నియామకాలకు ఒప్పందం చేసుకున్నారు. తెలంగాణ యువతకు ఈ అవకాశాలు రానున్నాయి.
(telugu-news | telugu breaking news | CM Revanth)