BIG BREAKING: 'రామప్ప దేవాలయాన్ని ధ్వంసం చేసే కుట్ర'

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ నేత పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బొగ్గు గని ప్రతిపాదించిన ప్రాంతం రామప్ప ఆలయానికి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నారు.

New Update
Ramappa temple Hanmakonda

Ramappa temple Hanmakonda

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి, యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప దేవాలయాన్ని, ఆ పరిసర ప్రాంతాలను విధ్వంసం చేసే కుట్ర చేస్తున్నాయని బీఆర్ఎస్ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి ఆరోపించారు. బొగ్గు గని ప్రతిపాదించిన ప్రాంతం రామప్ప దేవాలయానికి కేవలం నాలుగున్నర కిలోమీటర్ల దూరంలోనే ఉందన్నారు. కేంద్రం ప్రతిపాదించిన ఓపెన్ కాస్ట్ బొగ్గు గనుల మైనింగ్ వల్ల రామప్ప ఆలయ ఆనవాళ్లకే ముప్పు వాటిల్లే ప్రమాదముందన్నారు. ఈ దేవాలయాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉందన్నారు. రామప్ప ఆలయం దగ్గర ఓపెన్ కాస్ట్ మైన్ల ప్రతిపాదన విరమించుకోవాలని బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నామన్నారు.  

 

(telugu-news | latest-telugu-news | telugu breaking news)

Advertisment
Advertisment
తాజా కథనాలు