బీఆర్ఎస్ పార్టీపై దాడికి కారణమిదే: కాంగ్రెస్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు!

బీఆర్ఎస్ నేత రామకృష్ణారెడ్డి కేసీఆర్ మెప్పు పొందేందుకు స్థాయిని మరిచి సీఎం రేవంత్ పై వ్యాఖ్యలు చేశాడని ఎమ్మెల్యే కుంభం అనిల్ ఫైర్ అయ్యారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. కావాలని తమ కార్యకర్తలను రెచ్చగొట్టారన్నారు.

New Update
Attack on BRS Party Office

Congress MLA Kumbham Anil Kumar Reddy

నిన్న యాదాద్రి భువనగిరి జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆఫీసుపై కాంగ్రెస్ నేతలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ అంశంపై భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పందించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి తన స్థాయిని మరచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశాడని ఫైర్ అయ్యారు. కేసీఆర్ మెప్పుకోసం ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సబబు కాదన్నారు. కేసీఆర్ పట్ల భక్తి చాటుకోవడానికి కాంగ్రెస్ కార్యకర్తలని రెచ్చగొట్టారని ఆరోపించారు. స్థాయిని మించి మాట్లాడితే కాంగ్రెస్ కార్యకర్తలు ఊరుకోరని స్పష్టం చేశారు. మాజీ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి రామకృష్ణారెడ్డిని పక్కన కూర్చోని మాట్లాడించాడన్నారు. ప్రజా స్వామ్యబద్ధంగా మాట్లాడాలని అన్నారు. పార్టీ కనుమరుగవుతున్న నేపథ్యంలో కావాలని జనంలోకి వెళ్లడానికి ఇదో కుట్ర పన్నారని ధ్వజమెత్తారు. యూత్ కాంగ్రెస్ నాయకులను గుండాలు అంటున్నారని ఫైర్ అయ్యారు.
ఇది కూడా చదవండి: TG News: కలెక్టరేట్‌లో రసాభాస.. అందరిముందే కొట్టుకున్న ఎమ్మెల్యేలు!

శేఖర్ రెడ్డి కనుమరుగు..

ఎమ్మెల్యేగా ఓడిపోయాక శేఖర్ రెడ్డి కనుమరుగు అయ్యాడన్నారు. తాను అడ్డు పడకపోతే శేఖర్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండే వాడన్నారు. బీఆర్ఎస్ ఐదు సంవత్సరాల పాలనలో భువనగిరిలో నయీం ఆగడాలు జరిగాయని నయీం సంబంధించిన ఆస్తులు ఎక్కడికి పోయాయని ప్రశ్నించారు. నయీం అనుచరులు చాలా మంది బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నారని ఆరోపించారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డి 100 ఎకరాల్లో వెంచర్ చేశాడన్నారు. అందులో అసైన్డ్ భూమి కూడా ఉందన్నారు. ఈ అంశంపై సర్వే చేయాలని డిమాండ్ చేశారు. 
ఇది కూడా చదవండి: TG: ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే.. సంక్రాంతివేళ మంత్రి పొన్నం శుభవార్త!

భువనగిరిలో ఒక్క ఇంచు భూమి కూడా కబ్జాకు గురి అయ్యేందుకు వీలు లేదన్నారు. ఎక్కడైనా ఎవరైనా కబ్జాలకు గురైతే తన దృష్టికి తీసుకురావాలన్నారు. కార్యకర్తలను రెచ్చగొట్టి పబ్బం గడుపుకోవాలని చూస్తున్నారని బీఆర్ఎస్ నేతలపై నిప్పులు చెరిగారు. ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే సహించేది లేదని కుంభం అనిల్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు