గోవా వెళ్లాలనుకుంటున్నారా ?.. సికింద్రాబాద్‌ నుంచి కొత్త రైలు ప్రారంభం

సికింద్రాబాద్‌ నుంచి గోవాకు కొత్త రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 9 నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్ నుంచి రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభం కానున్నాయి.

New Update
Train

Secunderabad to Goa Train: గోవా వెళ్లాలనుకుంటున్నారా ?. అయితే మీకో గుడ్‌న్యూస్. సికింద్రాబాద్‌ నుంచి గోవాకు రైలు అందుబాటులోకి వచ్చేసింది. ఈ రైలును కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి సికింద్రాబాద్‌ రైల్వేస్టేషన్‌లో ఆదివారం జెండా ఊపి ప్రారంభించారు. అక్టోబర్ 9 నుంచి సికింద్రాబాద్‌ నుంచి రెగ్యులర్‌ సర్వీసులు ప్రారంభం కానున్నాయి. అలాగే అక్టోబర్10 నుంచి గోవాలోని వాస్కోడగామా స్టేషన్ నుంచి ప్రారంభమవుతాయి. వాస్కోడగామా-సికింద్రాబాద్‌ (17040) రైలు ప్రతీ గురు, శనివారాల్లో బయలుదేరుతాయి. 

Also Read: తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. రెవెన్యూ శాఖలో ఉద్యోగాలు

అయితే ప్రస్తుతం సికింద్రాబాద్-వాస్కోడగామా మధ్య రెగ్యులర్ సర్వీసు(17603) ఉంది. ఇది మంగళ, బుధ, ఆదివారాల్లో నడుస్తోంది. ప్రయాణికుల నుంచి తీవ్ర డిమాండ్ ఉండటం వల్ల ఈ రైలు.. ఎప్పుడూ ప్రయణికులతో కిటకిటలాడుతుంది. అలాగే హైదరాబాద్ నుంచి వాస్కోడగామాకు మరో రైలు కూడా ఉంది. కానీ ఇది వారంలో ఒకరోజు మాత్రమే నడుస్తుంది. ఈ రైలులో టికెట్లు దొరకడం కూడా కష్టమే. ఈ నేపథ్యంలోనే కొత్త రైలు రావడంతో పర్యాటకుల ప్రయాణ అవకాశాలు మరింత పెరగనున్నాయి. ఈ కొత్త రైలు సికింద్రాబాద్ నుంచి న్ కాచిగూడ ,షాద్నగర్, జడ్చర్ల మహబూబ్నగర్, గద్వాల, కర్నూల్ సిటీ, డోన్, గుంతకల్, బళ్ళారీ, హోస్పేట, కొప్పల్, గదడ్, హుబ్బలి, దర్వాడ్, లోండా, మడగాన్ మీదుగా మొత్తం 20 స్టేషన్లలో ఆగుతూ గోవాకు చేరుకుంటుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు