AP: ఘోర రోడ్డు ప్రమాదం.. నలుగురు దుర్మరణం

తిరుపతి జిల్లా చంద్రగిరి మండలం భాకరాపేటలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కంటైనర్‌ లారీ అదుపుతప్పి కారుని, బైక్‌ని ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. అతివేగం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు.

author-image
By B Aravind
Lorry
New Update

Road Accident in AP: తిరుపతి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. చంద్రగిరి మండలం భాకరాపేటలో ఓ కంటైనర్‌ లారీ అదుపుతప్పి కారుని, బైక్‌ని ఢీకొంది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. కలకల నుంచి చెన్నై వైపు ఆ లారీ టమాటాల లోడ్‌తో వెళ్తున్నట్లు పోలీసులు తెలిపారు. అతివేగం వల్ల ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. 

#accident #road-accident #thirupathi
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe