Vijay-Rashmika: సీఎం రేవంత్‌ను కలిసిన రష్మిక.. రిసెప్షన్ కు ఆహ్వానం

హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న గురువారం పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే.  రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌‌లో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. మార్చి 4 న హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహిస్తున్నారు. రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.

New Update
FotoJet (5)

Rashmika meets CM Revanth.. invited to the reception

Vijay- Rashmika : హీరో విజయ్ దేవరకొండ, హీరోయిన్ రష్మిక మందన్న గురువారం పెళ్లి(ashmika-Vijay Marriage) చేసుకున్న సంగతి తెలిసిందే.  రాజస్థాన్‌ ఉదయ్‌పూర్‌‌లోని ఐటీసీ మెమెంటోస్‌లో వీరి పెళ్లి అత్యంత ఘనంగా జరిగింది. ఉదయం తెలుగు సంప్రదాయం ప్రకారం.. సాయంత్రం కొడవ సంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకోవడం విశేషం. అయితే ఈ పెళ్లికి అతి కొద్ది మంది బంధుమిత్రులను, స్నేహితులను మాత్రమే ఆహ్వానించారు. శుక్రవారం ఈ జంట హైదరాబాద్‌ తిరిగివచ్చింది. కాగా మార్చి 4 న హైదరాబాద్‌లో చాలా గ్రాండ్‌గా రిసెప్షన్ నిర్వహించబోతున్నారు. వారి రిసెప్షన్‌కు సినీ, రాజకీయ ప్రముఖులను ఆహ్వానించారు.

Also Read :  హిట్ ట్రాక్ ఎక్కిన సంతోష్ శోభన్.. వరుస ప్రాజెక్టులతో ఫుల్ జోష్!

సీఎం దంపతులను కలిసిన రష్మిక

కాగా ఆదివారం రష్మిక మందన్న తెలంగాణ సీఎం రేవంత్‌ రెడ్డి(cm-revanthreddy) ని ఆయన నివాసంలో కలిశారు. 4న నిర్వహించే తమ రిసెప్షన్‌(reception) కు రావాలని ముఖ్యమంత్రిని ఆమె ఆహ్వానించారు. ఈ సందర్భంగా సీఎం సతీమణి రష్మికకు తెలంగాణ సంప్రదాయం ప్రకారం బొట్టుపెట్టి కొత్త బట్టలను అందజేసింది.

Also Read :  అమ్మకి పెళ్లి చేస్తా.. ఆమె సంతోషమే నాకు ముఖ్యం: సుప్రీత

ప్రధాని మోదీకి ఆహ్మానం

హైదరాబాద్‌ లో మార్చి 4న జరగనున్న తమ రిసెప్షన్‌కు రావాలని విజయ్, రష్మిక((Vijay Devarakonda - Rashmika)) లు శుక్రవారం ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi) ని కలిశారు. ఈ సందర్భంగా రిసెప్షన్‌కు రావాలని ప్రధానికి ప్రత్యేక ఆహ్వానం అందించారు. ప్రధానితో పాటు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షాను కూడా ఈ జంట కలిశారు. పెళ్లి రిసెప్షన్‌కు రావాలని అహ్వానించారు. ఈ సందర్భంగా ఇన్విటేషన్‌తో పాటు వినాయకుడి విగ్రహాన్ని కూడా వారికి అందించారు.  

టీటీడీ టెంపుల్‌ లో సందడి

కాగా ఆదివారం నూతన దంపతులు విజయ్‌ దేవరకొండ, - రష్మిక  హైదరాబాద్‌లోని టీటీడీ ఆలయాన్ని సందర్శించారు.  శ్రీవేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వేదపండితుల ఆశీర్వాదం తీసుకున్నారు. అనంతరం భక్తులు, అభిమానులకు స్వీట్‌ బాక్సులను అందజేశారు. దీనికి సంబంధిత వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.  

Advertisment
తాజా కథనాలు