HMDA: అంబేడ్కర్‌ విగ్రహ ప్రాంగణంలోకి ప్రజలకు అనుమతి

హైదరాబాద్‌ సందర్శకులకు శుభవార్త.. ఎట్టకేలకు హుస్సేన్‌ సాగర్‌ తీరంలోని 125  అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌  విగ్రహ దర్శనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. నేడు అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల నిర్వహణకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది.

New Update
 World's Tallest Dr.B.R. Ambedkar Statue

World's Tallest Dr.B.R. Ambedkar Statue

World's Tallest Dr.B.R. Ambedkar Statue

: హైదరాబాద్‌ సదర్శకులకు శుభావార్త.. ఎట్టకేలకు హుస్సేన్‌ సాగర్‌ తీరంలోని 125  అడుగుల ఎత్తైన అంబేడ్కర్‌  విగ్రహ దర్శనానికి ప్రభుత్వం అనుమతిచ్చింది. నేడు అంబేడ్కర్‌ జయంతి సందర్భంగా అంబేడ్కర్‌ జయంతి ఉత్సవాల నిర్వహణకు హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది.

Also Read:  Tv Offers: వారెవ్వా ఆఫర్లు కుమ్మేశాయ్.. 40 ఇంచుల స్మార్ట్‌టీవీలు కేవలం రూ.15వేల లోపే!
 
రాష్ర్టంలో  బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఓటమిపాలయి, కాంగ్రెస్‌ అధికారంలో కి రావడంతో గత ప్రభుత్వం నిర్మించిన అనేక కట్టడాల విషయంలో ప్రభుత్వం పట్టి పట్టనట్టు వ్యవహరిస్తోందన్న ఆరోపణలున్నాయి.  ముఖ్యంగా 125 అడుగుల అంబేడ్కర్‌ విగ్రహ దర్శనానికి అనుమితివ్వకపోవడం, ప్రభుత్వం కూడా నివాళులు అర్పించకపోవడంతో విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఈసారి జయంతి ఉత్సవాల నిర్వహణ కోసం హెచ్‌ఎండీఏ ఏర్పాట్లు చేసింది. హుస్సేన్‌సాగర్‌ తీరంలో 125 అడుగుల ఎత్తుతో నిర్మించిన అంబేడ్కర్‌ విగ్రహం వద్ద వీవీఐపీల నుంచి సాధారణ ప్రజల వరకు అందరూ నివాళులర్పించేలా చర్యలు చేపట్టింది.

Also Read: అక్టోబర్ నుండి ఛార్జ్ తీసుకోనున్న సిన్సియర్ పోలీస్ ఆఫీసర్..

అంబేడ్కర్‌ విగ్రహం పాదాల దాకా వెళ్లేందుకు ఇప్పటివరకు అవకాశం లేదు. అయితే, సోమవారం వీవీఐపీలను, వీఐపీలను ఇందుకు అనుమతించనున్నారు. అంబేడ్కర్‌ విగ్రహ పీఠం(పాత పార్లమెంటు భవనం ఆకారంలో నిర్మించారు)లో ఏర్పాటు చేసిన లైబ్రరీ, మ్యూజియం సందర్శనకు కూడా ప్రజలను అనుమతించనున్నారు. అయితే, అవి ఇంకా పూర్తి స్థాయిలో అందుబాటులోకి రాలేదు.

Also Read: Vijay: వక్ఫ్ సవరణ చట్టంపై హిరో విజయ్ సంచలన నిర్ణయం

 ఈ నేపథ్యంలో.. అంబేడ్కర్‌ జీవితం నుంచి ప్రేరణ పొందే ఘట్టాలను చిత్రిస్తూ రూపొందించిన కళాఖండాలను సేకరించడానికి హెచ్‌ఎండీఏ ఆధ్వర్యంలో విద్యార్థులు, కళాకారులకు పోటీలు నిర్వహిస్తున్నారు. రెండు రోజులుగా అంబేడ్కర్‌ విగ్రహం వద్ద జరుగుతున్న ఈ పోటీల్లో 20 బృందాల దాకా పాల్గొంటున్నాయి. పెయింటింగ్‌, ఇతరత్రా ఆర్ట్‌ సామగ్రి కోసం హెచ్‌ఎండీఏ ఒక్కో బృందానికి రూ.10వేల చొప్పున అందజేసింది. ఈ బృందాలు రూపొందించిన కళాఖండాలను అంబేడ్కర్‌ జయంతి రోజున మ్యూజియంలో ప్రదర్శించనున్నారు. ఇందులో ఉత్తమమైన మూడింటిని ఎంపిక చేసి వారికి నగదు బహుమతులు అందిస్తారు. ఆ కళాఖండాలను అంబేడ్కర్‌ మ్యూజియంలో శాశ్వతంగా ఏర్పాటు చేయనున్నారు.

Also Read: 'చూపుల్తో గుచ్చి గుచ్చి’ మాస్ జాతర ప్రోమో సాంగ్ అదిరిపోయిందిగా..!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు