Phone Tapping Case: బిగ్ ట్విస్ట్.. హైదరాబాద్‌కు చేరుకున్న ప్రభాకర్ రావు

ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న SIB మాజీ డీజీపీ ప్రభాకర్ రావు ఇండియాకు చేరుకున్నారు. LOC, రెడ్ కార్నర్ నోటీసులు మంజూరు చేసు ఆయన అమెరికా పాస్‌పోర్టును రద్దు చేయించారు పోలీసులు. దీంతో ప్రభాకర్ రావు ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

New Update
phone tapping case 123

Phone Tapping Case

Phone Tapping Case:

ఎస్‌ఐబీ కేంద్రంగా జరిగిన అక్రమ ఫోన్‌ ట్యాపింగ్‌ కేసు(Phone Tapping Case)లో ప్రధాన నిందితుడిగా ఉన్న ఆ విభాగం మాజీ చీఫ్‌ టి.ప్రభాకర్‌రావు(Prabhakar Rao Phone Tapping Case) సోమవారం సిట్‌ ఎదుట విచారణ(SIT Inquiry)కు హాజరయ్యే అవకాశం ఉంది. సుదీర్ఘకాలం అమెరికాలో తలదాచుకున్న ఆయనపై ఎల్‌ఓసీ, రెడ్‌ కార్నర్‌ నోటీసులు జారీ చేయించిన పోలీసులు ఆయన పాస్‌పోర్టునూ రద్దు చేయించారు.

Also Read :  అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు

గత నెల్లో సుప్రీంకోర్టు స్వల్ప ఊరట ఇవ్వడంతో ప్రభాకర్‌రావు భారత్‌కు వచ్చేందుకు మార్గం సుగమమైంది. దీంతో ఆయన అమెరికాలోని భారత ఎంబసీకి పాస్‌పోర్టు కోసం దరఖాస్తు చేసుకుని, గత శుక్రవారం ఎమర్జెన్సీ సర్టిఫికెట్‌ పొందారు. దీని ఆధారంగా ఆయన ఆదివారం హైదరాబాద్‌(Hyderabad)కు తిరిగి వచ్చారు. నిరీణత గడువులోగా సిట్‌ ఎదుట విచారణకు హాజరుకావాల్సి ఉండటంతో సోమవారం జూబ్లీహిల్స్‌లోని సిట్‌ కార్యాలయాని(Jubilee Hills SIT Office)కి రానున్నారని సమాచారం. అక్కడే అధికారుల ఎదుట విచారణకు హాజరవుతారు.  

Also Read :  అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు

ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఏ1గా ఉన్న ప్రభాకర్‌రావు హైదరాబాద్‌ చేరుకున్నారు. పదిహేను నెలల తర్వాత ఆయన ఆదివారం రాత్రి  7.40 గంటలకు శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనపై లుక్‌ఔట్‌ నోటీసులు ఉండటంతో ఎయిర్‌పోర్టులోని ఇమిగ్రేషన్‌ అధికారులు లోతుగా విచారిస్తున్నారు. రాత్రి 10.30 గంటల వరకు కూడా అధికారులు విచారణ కొనసాగిస్తూనే ఉన్నారు. విచారణ అనంతరం సిట్‌ బృందం ఆయనను అదుపులోకి తీసుసుకునేందుకు ఏర్పాట్లు చేసింది.

Also Read :  ఛత్తీస్‌గఢ్ ఎన్‌కౌంటర్‌లో ఏడుగురు మావోయిస్టులు మృతి

 

Advertisment
Advertisment
తాజా కథనాలు