/rtv/media/media_files/2025/06/08/hYOjNgAJV4ZpNoZcHFzu.jpeg)
మాగంటి గోపినాథ్ 1983లో టీడీపీతో రాజకీయాల్లోకి వచ్చారు. ఆయన తెలంగాణ రాష్ట్రంగా ఉన్నప్పుడు 1963లో హైదరాబాద్లో జన్మించారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టగానే అందులో జాయిన్ అయ్యారు. జూబ్లీహిల్స్ నియోకవర్గం నుంచి 3సార్లు ఎమ్మెల్యేగా గెలిచి హ్యాట్రిక్గా నిలిచారు. ఆయన పదవి కాలం 3ఏళ్ళు ఉండగానే జూన్ 8న ఆరోగ్య సమస్యలతో హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. 1963 జూన్ 2న కృష్ణమూర్తి, మహానంద కుమారి దంపతులకు హైదరాబాదులోని హైదర్గూడలో జన్మించాడు. 1980లో వెంకటేశ్వర ట్యుటోరియల్స్ నుండి ఇంటర్మీడియట్, 1983లో ఉస్మానియా యూనివర్సిటీలో గ్రాడ్యుయేషన్ (బిఏ) పూర్తిచేశాడు. గోపినాథ్కు సునీతతో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
టీడీపీలో 1985 నుంచి 1992 వరకు తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడిగా పని చేశారు. 1988 నుంచి 93 వరకు వినియోగదారుల ఫోరం అధ్యక్షుడిగా, టీడీపీ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా వివిధ హోదాల్లో సేవలు అందించారు. 1987, 1988లో హుడా డైరెక్టర్గా బాధ్యతలు నిర్వర్తించారు. 2014లో టీడీపీ తరపున జూబ్లీహిల్స్ నుంచి ఎమ్మెల్యేగా పోటీ చేసి తొలిసారి శాసనసభలో అడుగుపెట్టారు. అనంతరం మారిన రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. 2018, 23లో ఆ పార్టీ నుంచే బరిలోకి దిగి హ్యాట్రిక్ విజయం సాధించారు. ప్రస్తుతం BRS హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడిగా కూడా ఆయన బాధ్యతలు నిర్వహిస్తున్నారు.
నిర్మాతగా నాలుగు సినిమాలు
పాతబస్తీ (1995)
రవన్న (2000)
భద్రాద్రి రాముడు (2004)
నా స్టైలే వేరు (2009)