/rtv/media/media_files/2025/04/11/IvR6npuZa7vLUiPldBfX.jpg)
MLA mallareddy
మాజీ మంత్రి, ఎమ్మెల్యే మల్లారెడ్డి మరోసారి హల్ చల్ చేశారు. తన సతీమణితో కలిసి సమ్మర్ ట్రిప్ కోసమని జపాన్ పర్యటనకు వెళ్లిన ఆయన అక్కడ వివిధ సిటీల్లో పర్యటిస్తూ ఫుల్ ఎంజాయ్ చేస్తున్నారు. స్థానిక ప్రజలతో కూడా ఫొటోలు దిగుతూ మల్లారెడ్డి సందడి చేస్తున్నారు. తాజాగా ఆ దేశంలోని టోక్యో నగరంలో జరిగిన జాపనీస్ ట్రేడిషనల్ టీ కార్యక్రమంలో మల్లారెడ్డి దంపతులు పాల్గొన్నారు. వెరైటీ డ్రెస్సులు వేసుకుని ఫోటోలకు ఫోజులు ఇచ్చారు. అంతకుముందు బుల్లెట్ ట్రైన్ ఎక్కారు మల్లారెడ్డి. ట్రైన్ ఎక్కడానికి ముందు బుల్లెట్ రైలు ఎదుట ఆయన దిగిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. మరి ఇంకెన్ని రోజులు మల్లారెడ్డి ఎన్నిరోజులు జపాన్ లో ఉంటారో తెలియాలి.
#Japan దేశంలో #kyoto నగరం జాపనీస్ ట్రేడిషనల్ #teaceremony కార్యక్రమంలో పాల్గొన మాజీ మంత్రివర్యులు మేడ్చల్ శాసనసభ్యులు శ్రీ చామకూర మల్లారెడ్డి దంపతులు pic.twitter.com/m0nI4fZQvS
— Chamakura Malla Reddy (@chmallareddyMLA) April 11, 2025