Hyderabad MLC Elections: బీజేపీకి భారీ షాక్..!! ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం గెలుపు.

హైదరాబాద్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించారు. బీజేపీ తరఫున బరిలో దిగిన గౌతమ్ రావుపై కేవలం 38 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

New Update
Hyderabad MLC Elections

Hyderabad MLC Elections

Hyderabad MLC Elections: హైదరాబాద్‌ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఎంఐఎం అభ్యర్థి మీర్జా రియాజ్ హసన్ విజయం సాధించారు. బీజేపీ తరఫున బరిలో దిగిన గౌతమ్ రావుపై కేవలం 38 ఓట్ల మెజారిటీతో ఎంఐఎం మీర్జా రియాజ్ హసన్ గెలుపొందారు. మొత్తం పోలైన 88 ఓట్లలో ఎంఐఎంకు 63 ఓట్లు, బీజేపీకి 25 ఓట్లు లభించాయి. క్రాస్ ఓటింగ్ మీద భారీగా ఆశలు పెట్టుకున్న బీజేపీకి తీరని నిరాశే ఎదురైంది.

అరగంటలోనే ఫలితాలు

ఏప్రిల్ 25న జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంలో ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమైంది. మొత్తం 112 ఓటర్లలో 88 ఓట్లు మాత్రమే పోల్​అయ్యాయి. లెక్కింపు మొదలైన అరగంటలోనే ఫలితాలు తేలిపోయాయి. 

కాంగ్రెస్, బీఆర్ఎస్ వెనక్కి

ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎంఐఎంకు మద్దతు తెలుపగా, బీఆర్ఎస్ మాత్రం ఓటింగ్ కు దూరంగా ఉంది. ఈ రెండు ప్రధాన పార్టీలు పోటీలో పాల్గొనకపోవడం గమనార్హం.

Also Read: ఇకపై పాకిస్తాన్‌తో ఎలాంటి మ్యాచ్‌లు ఉండవు : బీసీసీఐ

Also ReadPahalgam: పహల్గామ్ లో నంబర్ ప్లేట్ లేని బైక్..ఉగ్రవాదులదేమోనని అనుమానం

Advertisment
Advertisment
తాజా కథనాలు