/rtv/media/media_files/2025/05/12/0mtwlR5WGen5joqZ0X0k.jpg)
పాకిస్తాన్ పై భారత్ చేపట్టిన ఆపరేషన్ సిందూర్ సక్సెస్ అయినందుకు ముగ్గురు అమ్మాయిలు గుడి మెట్లపై మోకాళ్లపై ఎక్కి తమ మొక్కు తీర్చుకున్నారు. మంచిర్యాలలో మరో అన్నవరంగా పేరు పొందిన దండేపల్లిలోని గూడెం శ్రీ రమా సహిత సత్యనారాయణ స్వామి గుడిని మోకాళ్లపై ఎక్కి తమ మొక్కు చెల్లించుకున్నారు.
లక్సెట్టిపేట పట్టణానికి చెందిన జిల్లా ఆర్యవైశ్య మహిళా సంఘం ప్రధాన కార్యదర్శి నరేందుల సాహితి, కార్యనిర్వాహక కార్యదర్శి అక్కినపల్లి రాధిక, మరో మిత్రురాలు అశ్విత కలిసి ఆదివారం గుడిలోని 0 మెట్లను మోకాళ్లపై ఎక్కి తమ మొక్కు తీర్చుకున్నారు. దేశ సంక్షేమం కోసం, భారత జవాన్ల క్షేమంగా ఉండాలని కోరుకుంటూ స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ప్రస్తుత సమయంలో మనమంతా సైనికులకు మద్దతుగా నిలవాలన్నారు. ఇక దేశం కోసం తల పెట్టిన ఆపరేషన్ సిందూర్లో వీరమరణం చెందిన జవాన్ల త్యాగం మరవలేమని అన్నారు.
adilabad | jawan | telangana | peddapalli | mancherial