MLC Election Results : మొదటి నుంచి ఆధిక్యం..ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ విజయం.

ఉమ్మడి కరీంనగర్‌-మెదక్‌-నిజామాబాద్‌-ఆదిలాబాద్‌ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్‌ అంజిరెడ్డి విజయం సాధించారు. మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. 53 మందికి 16,000 లోపే ఓట్లు రావడంతో అంజిరెడ్డి విజయం సాధించారు.

New Update
Graduate MLC Elections Anji Reddy

Graduate MLC Elections Anji Reddy

 MLC Election Results : కరీంనగర్ అదిలాబాద్ మెదక్ నిజాంబాద్ ఉమ్మడి జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గంలో బీజేపీ అభ్యర్థి చిన్నమైల్‌ అంజిరెడ్డి విజయం సాధించారు. మరికాసేపట్లో అధికారిక ప్రకటన వెలువడనుంది. 53 మందికి 16,000 లోపే ఓట్లు రావడంతో అంజిరెడ్డి విజయం సాధించారు. బీజేపీ అభ్యర్థి విజయంతో బీజేపీ శ్రేణులు సంబురాలకు సిద్దమవుతున్నాయి. మూడు రోజుల పాటు ఉత్కంఠగా కొనసాగిన ఓట్ల లెక్కింపులో మొదటి నుంచి బీజేపీ లీడ్ లో కొన సాగింది. కాగా ఈ నియోజక వర్గంలో అత్యధికంగా 56 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు.

Also read: Janasena: ఎమ్మెల్సీ అభ్యర్థిగా నాగబాబు.. అధికారిక ప్రకటన!

 రెండో ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో అంజిరెడ్డి విజయం ఖరారైంది. అంజిరెడ్డికి 78,635 ఓట్లు రాగా.. కాంగ్రెస్‌ అభ్యర్థి నరేందర్‌రెడ్డికి 73,644 ఓట్లు వచ్చాయి. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణకు 63,404 ఓట్లు పడ్డాయి. అంజిరెడ్డి విజయం ఖరారు కావడంతో కౌంటింగ్ హాలు నుంచి నరేందర్ రెడ్డి వెళ్లిపోయారు. కాగా, కరీంనగర్ టీచర్స్, గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ స్థానాలు బీజేపీ వశం అయ్యాయి. మరోవైపు అంజిరెడ్డి విజయంపై ఎన్నికల అధికారులు మరికాసేపట్లో ప్రకటన చేయనున్నారు.

ఇది కూడా చదవండి: Sharmila: జగనన్నను వదలని షర్మిల.. ఆ కుట్రలో కర్త, కర్మ, క్రియ అంటూ సంచలన ఆరోపణలు!

కాంగ్రెస్ అభ్యర్థి ఆల్పోర్స్ నరేందర్ రెడ్డి , బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ మధ్య పోటీ ఉంటుందని భావించినప్పటికీ కాంగ్రెస్, బీజేపీల మధ్యే నువ్వా నేనా అన్నట్లు పోటీ సాగింది. బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ గట్టి పోటీ ఇచ్చి సత్తా చాటారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నియోజక వర్గంలో మూడు సభల్లో పాల్గొన్నప్పటికీ అధికారపార్టీ విజయం సాధించలేకపోయింది. కాగా టీచర్లతో పాటు పట్టభద్రుల స్థానంలోనూ బీజేపీ అభ్యర్థులే విజయం సాధించారు.

ఇది కూడా చదవండి: Breaking News : తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యేకు న్యూడ్ కాల్!

మొదటి ప్రయార్టీ ఓట్ల లెక్కింపుతో ఫలితం తేలకపోవడంతో సెకండ్ ప్రయార్టీ ఓట్ల లెక్కింపు చేపట్టారు. బీజేపీ అభ్యర్థి అంజిరెడ్డి, కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్‌రెడ్డి మధ్య పోటీ రౌండ్ రౌండ్‌కు టెన్షన్ పెట్టిస్తున్నది. అయితే రెండో ప్రయార్టీ ఓట్ల లెక్కింపులోనూ ఈ ఇద్దరిలో గెలుపు కోసం నిర్ధారించిన 1,11,672 ఓట్ల సంఖ్యను అభ్యర్థులు చేరుకోలేకపోయారు. దీంతో మొత్తం పోటీ చేసిన 56 మంది అభ్యర్థుల్లో సాయంత్రం 4గంటల వరకు 52 మందిని ఎలిమినేట్ చేశారు. ఆ తర్వాత బీఎస్పీ అభ్యర్థి ప్రసన్న హరికృష్ణ , మరో అభ్యర్థి యాదగిరి శేఖర్‌రావును కూడా ఎలిమినేట్ చేశారు. దీంతో అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డి  మినహా మిగతావారంతా ఎలిమినేట్ అయ్యారు. వారి ఓట్లను అంజిరెడ్డి, నరేందర్‌రెడ్డికి బదలాయించారు.  దీంతో అంజిరెడ్డి విజయం ఖాయమైంది.

Also Read :  ఏపీలో మహిళా రైడర్లు..ర్యాపిడోతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం

Advertisment
Advertisment
తాజా కథనాలు