Phone tapping case: SIT విచారణలో KCR ఎమోషనల్..

BRS అధినేత కేసీఆర్ తన నివాసంలో నేడు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు హాజరైయ్యారు. నందినగర్‌లోని ఆయన ఇంట్లో రెండవ అంతస్థులో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన లంచ్ మీట్ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు.

New Update
KCR

KCR

BRS అధినేత కేసీఆర్ తన నివాసంలో నేడు ఫోన్ టాపింగ్ కేసులో విచారణకు హాజరైయ్యారు. నందినగర్‌లోని ఆయన ఇంట్లో రెండవ అంతస్థులో సిట్ అధికారులు ఆయన్ని ప్రశ్నించనున్నారు. ఈ సందర్భంగా పార్టీ నేతలతో ఏర్పాటు చేసిన లంచ్ మీట్ సందర్భంగా కేసీఆర్ భావోద్వేగానికి లోనయ్యారు. నంది నగర్‌లోని తన ఇల్లు తెలంగాణ ఉద్యమానికి ప్రధాన కేంద్రమని, అక్కడే ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు శ్రమించానని ఆయన గుర్తు చేసుకున్నారు. వేలాది మందితో చర్చలు జరిపి, వ్యూహరచన చేసిన అదే గదిలో ఈరోజు విచారణను ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరమని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకప్పుడు రాష్ట్ర భవిష్యత్తును మార్చే నిర్ణయాలు తీసుకున్న గదిలో, ఇప్పుడు విచారణ ఎదుర్కోవడం తనను మానసికంగా కలచివేస్తోందని కేసీఆర్ పేర్కొన్నారు. తెలంగాణ కోసం నిద్రలేని రాత్రులు గడిపిన చోటే ఇలాంటి పరిస్థితులు రావడం ఎవరూ ఊహించని పరిణామమని ఆయన వ్యాఖ్యానించారు.

Advertisment
తాజా కథనాలు