Maganti Gopinath : జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ కు సీరియస్..ఆస్పత్రికి తరలింపు

హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గోపినాథ్ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. సమస్య ఎక్కువ కావడంతో ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

New Update
Maganti Gopinath

Maganti Gopinath

Maganti Gopinath : హైదరాబాద్‌ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గోపినాథ్ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా ఆయన నాలుగు రోజుల క్రితం తీవ్రంగా అవస్థ పడ్డారు. సమస్య ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.

ఇది కూడా చదవండి: Rape case: మ్యాట్రిమోనిలో వల.. పెళ్లిపేరుతో 15 మందిని రేప్ చేసిన యువకుడు.. చివరికి ఏమైందంటే!


 గత కొంతకాలంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సమస్య మరింత జఠిలం కావడంతో ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా గోపినాథ్ ఆరోగ్య పరిస్థితపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు.

ఇది కూడా చదవండి: Viral News: కోడిపుంజుపై కేసు.. ఆర్డీవో విచారణ: చివరికి ఏమైందంటే!

  మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నియోజకవర్గంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు యాక్టివ్ గా ఉండే గోపినాథ్ అస్వస్థతకు గురయ్యాడని తెలిసిన వెంటనే పలువురు నియోజకవర్గ నాయకులు ఆయనను పరమార్శించడానికి ఆసుపత్రి వద్ద క్యూ కట్టారు. కార్పొరేటర్లు, స్థానిక నాయకులు ఆయన కుటుంబ సభ్యులను అడిగి అరోగ్యపరిస్థితిపై ఆరాతీస్తున్నారు.

Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్

మాగంటి గోపినాథ్ ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.తొలిసారి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ టీడీపీ టికెట్‌పై గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ర్టం ఏర్పడటం, రాష్ర్ట విభజన జరగడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతోన్నారు. 2019 ఎన్నికల్లో సైతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందాడు. ఈసారి 2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి మూడోసారి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు.

Also Read: Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్‌లలోకి డబ్బులు!

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

TG Crime: కామారెడ్డిలో పంచాయతీ కార్యదర్శి దారుణ హత్య.. మృతదేహం చెరువులో లభ్యం

కామారెడ్డి జిల్లా పిట్లం మండలంచిన్న కొడప్‌గల్ శివారులో దారుణం చోటు చేసుకుంది. రెడ్డి చెరువులో గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ (37) మృతదేహం లభ్యమైంది. ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు.

New Update

Crime News: కామారెడ్డి జిల్లా పిట్లం మండలంలో దారుణ సంఘటన చోటుచేసుకుంది. జుక్కల్ నియోజకవర్గ పరిధిలోని చిన్న కొడప్ గల్ శివారులో ఉన్న రెడ్డి చెరువులో శనివారం ఉదయం గ్రామ పంచాయతీ కార్యదర్శి కృష్ణ (37) మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించడం స్థానికులను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ఘటనపై వెంటనే సమాచారం అందుకున్న పోలీసులు.. ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని వెలికి తీశారు. కృష్ణ తలపై తీవ్ర గాయాలు కనిపించడంతో ఇది సహజ మరణం కాదని.. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఉద్దేశ్యపూర్వకంగా హత్య చేసి చెరువులో పడేసినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు.

చెరువులో పంచాయతీ కార్యదర్శి మృతదేహం..

కృష్ణ, పోతిరెడ్డిపల్లె పరిధిలోని జగదాంబ తండాకు చెందిన వ్యక్తి. అతను గత రెండు రోజులుగా అదృశ్యమయ్యాడు. కుటుంబ సభ్యులు ఎంత ప్రయత్నించినా ఆయన ఆచూకీ లభించకపోవడంతో తీవ్ర ఆందోళనలో ఉండగా.. చివరికి రెడ్డి చెరువులో మృతదేహం కనిపించడంతో వారి ఆశలు నెరవేరకుండా పోయాయి. శవాన్ని పరిశీలించిన పోలీసులకు తలపై బలంగా కొట్టిన గాయాలు స్పష్టంగా కనిపించాయి. ఈ నేపథ్యంలో ఇది ఒక పక్కా హత్యగా భావిస్తున్నారు. అయితే హత్యకు గల కారణాలు ఇంకా స్పష్టంగా తెలియాల్సి ఉంది.

ఇది కూడా చదవండి: నిద్రలో ఈ 6 లక్షణాలు కనిపిస్తే.. మీ కిడ్నీలు డేంజర్లో ఉన్నట్లే!

ప్రాథమికంగా పోలీసులు అనుమానిస్తున్న అంశాల్లో అక్రమ సంబంధం కోణం కూడా ఒకటి. వ్యక్తిగత ద్వేషం, పాత కక్షలు, లేదా మరేదైనా వ్యక్తిగత కారణం కావచ్చన్న కోణాల్లోనూ విచారణ చేస్తున్నారు. సంఘటన వెలుగులోకి రావడంతో డీఎస్పీ, సీఐ, ఎస్సై స్థాయి అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసుల ప్రకారం.. కేసు దర్యాప్తు కొనసాగుతున్నదిగా తెలిపారు. గ్రామస్తులు, బంధువులు కృష్ణ హత్యపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తూ న్యాయం జరగాలని కోరుతున్నారు. ఈ సంఘటనతో పిట్లం మండలంలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

ఇది కూడా చదవండి: మద్యం తాగడం అనే పొరపాటు చేయకండి! మీ కాలేయం పాడైపోతుంది.. ఫ్రూఫ్‌ ఇదే!

( ts-crime | ts-crime-news | Latest News )

Advertisment
Advertisment