/rtv/media/media_files/2025/02/20/VjgPhTTjq7gFKRigmOSo.jpg)
Maganti Gopinath
Maganti Gopinath : హైదరాబాద్ జూబ్లీహిల్స్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే మాగంటి గోపినాథ్ తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయనను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించారు. గోపినాథ్ కొంతకాలంగా కిడ్నీ సమస్యతో బాధపడుతున్నారు. దీని కారణంగా ఆయన నాలుగు రోజుల క్రితం తీవ్రంగా అవస్థ పడ్డారు. సమస్య ఎక్కువ కావడంతో కుటుంబసభ్యులు ఆయనను వెంటనే ఆసుపత్రికి తరలించారు.
గత కొంతకాలంగా ఎమ్మెల్యే మాగంటి గోపీనాధ్ అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల సమస్య మరింత జఠిలం కావడంతో ఆయన ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. అయితే నాలుగు రోజుల క్రితం ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఆయనను నగరంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యాన్ని వైద్యుల బృందం పర్యవేక్షిస్తోంది. అన్ని రకాల పరీక్షలు నిర్వహిస్తున్నారు. కాగా గోపినాథ్ ఆరోగ్య పరిస్థితపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ వారి కుటుంబ సభ్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్య పరీక్షలు నిర్వహించి మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను ఆయన కోరారు.
ఇది కూడా చదవండి: Viral News: కోడిపుంజుపై కేసు.. ఆర్డీవో విచారణ: చివరికి ఏమైందంటే!
మరోవైపు ఆయన ఆరోగ్య పరిస్థితిపై నియోజకవర్గంలో ప్రజల్లో ఆందోళన మొదలైంది. ఎప్పుడు యాక్టివ్ గా ఉండే గోపినాథ్ అస్వస్థతకు గురయ్యాడని తెలిసిన వెంటనే పలువురు నియోజకవర్గ నాయకులు ఆయనను పరమార్శించడానికి ఆసుపత్రి వద్ద క్యూ కట్టారు. కార్పొరేటర్లు, స్థానిక నాయకులు ఆయన కుటుంబ సభ్యులను అడిగి అరోగ్యపరిస్థితిపై ఆరాతీస్తున్నారు.
Also Read: USA: అబ్బా మళ్ళీ కొట్టాడు..ఔషధాలపై 25శాతం సుంకం ప్రకటన..కుప్పకూలిన ఫార్మా స్టాక్స్
మాగంటి గోపినాథ్ ఇప్పటివరకు మూడుసార్లు ఎమ్మెల్యేగా విజయం సాధించారు.తొలిసారి 2014 అసెంబ్లీ ఎన్నికల్లో మాగంటి గోపినాథ్ టీడీపీ టికెట్పై గెలుపొందారు. ఆ తర్వాత తెలంగాణ రాష్ర్టం ఏర్పడటం, రాష్ర్ట విభజన జరగడంతో ఆయన బీఆర్ఎస్ లో చేరారు. నాటి నుంచి ఆయన ఆ పార్టీలోనే కొనసాగుతోన్నారు. 2019 ఎన్నికల్లో సైతం జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలుపొందాడు. ఈసారి 2023 ఏడాది చివరిలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో జూబ్లీహిల్స్ అసెంబ్లీ స్థానం నుంచి మూడోసారి మాగంటి గోపినాథ్ విజయం సాధించారు.
Also Read: Nara Lokesh: ఏపీ విద్యార్థులకు మంత్రి లోకేష్ అదిరిపోయే వార్త.. అకౌంట్లలోకి డబ్బులు!