/rtv/media/media_files/2025/03/05/bg6udZwfdl60UmTJBylE.jpg)
తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మార్చి 05వ తేదీన మొదలై 25 వ వరకు జరగనున్నాయి. బుధవారం ఇంటర్ ఫస్ట్ ఇయర్, గురువారం ఇంటర్ సెంకడియర్ విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం అవుతాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు నిర్వహిస్తారు. రాష్ట్రవ్యాప్తంగా 1,532 పరీక్షాకేంద్రాలను ఏర్పాటు చేశారు. పరీక్ష ప్రారంభమైన 5 నిమిషాల వరకు విద్యార్థులను అనుమతిస్తారు.
ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ కు 4 లక్షల 88 వేల 448 మంది విద్యార్థులు హాజరు కానున్నారు. ఇక సెకండియర్లో 5లక్షల8 వేల523 విద్యార్థుల చొప్పున హాజరుకానున్నారు. వాచ్, స్మార్ట్ వాచ్, అనలాగ్ వాచ్లపై అధికారులునిషేధం విధించారు. పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. పరీక్ష రాసే విద్యార్థులు ఉదయం 8 గంటల 45 నిమిషాలకు ఎగ్జామ్ సెంటర్ లోకి వెళ్లడం ఉత్తమం అని అధికారులు సూచించారు. పరీక్షల కోసం 29 వేల 992 మంది ఇన్విజిలెటర్లు, 72 మంది ప్లయింగ్స్కాడ్, 124 సిట్టింగ్ స్కాడ్లకు విధులు కేటాయించారు.
పరీక్ష జరిగే సమయాల్లో 144 సెక్షన్
హాల్ టికెట్లపై క్యూఆర్ కోడ్ ముద్రించారు. దీనిని స్కాన్ చేసి కేటాయించిన సెంటర్లకు స్టూడెంట్లు సకాలంలో చేరుకోవాల్సి ఉంటుంది. ఏమైనా ఇబ్బందులు ఎదురైతే స్టేట్ కంట్రోల్ రూమ్ 9040205555 నంబర్ కు ఫోన్ చేయాలని ఇంటర్ బోర్డు సెక్రటరీ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. విద్యార్థులు పరీక్షల భయంతో మానసికంగా ఇబ్బందులకు గురైతే టెలీ మానస్ 14416 టోల్ ఫ్రీ నంబర్ కు ఫోన్ చేయవచ్చుని సూచించారు. ఇంటర్ పరీక్షల దృష్ట్యా విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు బస్సు సేవలను పెంచినట్టు అధికారులు తెలిపారు. పరీక్ష జరిగే సమయాల్లో స్థానికంగా 144 సెక్షన్ అమలులోఉండగా.. పరీక్ష కేంద్రంలో తాగునీరు, ఏఎన్ఎం, ఆశ వర్కర్ అందుబాటులోనే ఉంటారు.
Also Read : ఈ రాశి వారు నేడు ఆకస్మిక ధన లాభాన్ని పొందుతారు..!