/rtv/media/media_files/2025/04/21/6CciVMXUFeorqSX1S17S.jpg)
HYDRA Chief Ranganath Warning
లే ఔట్లతో పాటు పలు నివాస ప్రాంతాల్లో రహదారులను ఆక్రమించి ఆటంకాలు సృష్టించవద్దని హైడ్రా కమిషనర్ ఏవీ రంగనాథ్ హెచ్చరించారు. ఒక వేళ ఎక్కడైనా ఆక్రమణలు ఉంటే వెంటనే వాటిని తొలగిస్తామన్నారు. ORR పరిధిలో ఎక్కడా రహదారుల వెంట ఆటంకాలు లేకుండా హైడ్రా చూస్తుందని భరోసా ఇచ్చారు. పార్కులు, పాఠశాలలు, గ్రంథాలయాలు, కమ్యూనిటీ హాళ్లు, ప్రాథమిక ఆసుపత్రులు ఇలా.. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలను అందుకోసమే ఉపయోగపడేలా చూడాలని సూచించారు. అలాంటి స్థలాలను ఎవరైనా ఆక్రమిస్తే వెంటనే వాటిని తొలగించి ప్రజలకు అందజేస్తామన్నారు.
రహదారుల ఆటంకాలను తొలగించండి
— HYDRAA (@Comm_HYDRAA) April 21, 2025
లేని పక్షంలో తామే తొలగిస్తామన్న హైడ్రా
హైడ్రా ప్రజావాణికి 52 ఫిర్యాదులు
🔸లే ఔట్లతో పాటు పలు నివాస ప్రాంతాల్లో రహదారులకు ఆటంకాలు సృష్టించవద్దని హైడ్రా కమిషనర్ శ్రీ ఏవీ రంగనాథ్ హితవు పలికారు.
🔸ఒక వేళ ఎక్కడైనా ఉంటే వెంటనే… pic.twitter.com/CUjE5DwRys
వారిపై కఠినంగా ఉండండి
రహదారులకు అడ్డంగా గోడలు కట్టి రాకపోకలకు అంతరాయం కలిగిస్తున్నారని సోమవారం హైడ్రా ప్రజావాణికి పలు ఫిర్యాదులు వచ్చాయి. ప్రజావసరాలకు ఉద్దేశించిన స్థలాలన బై నంబరు జోడించి కాజేసేస్తున్నారని పలువురు ఫిర్యాదు చేశారు. సోమవారం మొత్తం 52 ఫిర్యాదులు ప్రజావాణికి వచ్చాయి. ప్రజల అవసరాల కోసం కేటాయించిన భూములను కాజేస్తున్న వారి పట్ల అధికారులు కఠినంగా ఉండాలని హైడ్రా కమిషనర్ ఆదేశించారు.
ఫిర్యాదులపై వెంటనే విచారణ చేపట్టి ఆక్రమణలను తొలగించాలని కమిషనర్ సూచించారు. చుట్టూ ఇళ్లున్నా.. మధ్యలో తమకున్న స్థలంలో ఇల్లు కట్టుకోనివ్వడం లేదని, చెరువుల ఎఫ్టీఎల్ పేరుతో అనుమతులు మంజూరు చేయడంలేదని పలువురు హైడ్రాకు ఫిర్యాదుచేశారు. చెరువుల ఎఫ్టీఎల్ నిర్ధారణ త్వరలో పూర్తవుతుందని కమిషనర్ వారికి వివరించారు.
(telugu-news | latest-telugu-news | hydra | Ranganath )