గేర్ మార్చిన హైడ్రా.. ఇకనుంచి నాలాల అక్రమ నిర్మాణాలు టార్గెట్

చెరువులు కబ్జా చేసిన వాళ్లకు వణుకు పుట్టించిన హైడ్రా.. ఇకనుంచి నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల సంగతి చూడబోతోంది. ఈ నేపథ్యంలోనే హైడ్రా కమిషనర్ రంగనాథ్ లక్డీకాపూల్, రాజ్‌భవన్‌‌ ప్రాంతాల్లో పర్యటించారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.

New Update
Nalaas

చెరువులు కబ్జా చేసిన వాళ్లకు వణుకు పుట్టించిన హైడ్రా.. మరో బిగ్ టాస్క్‌ చేపట్టింది. ఇక నుంచి హైడ్రా కమిషనర్ రంగనాథ్ నాలాలపై ఉన్న అక్రమ నిర్మాణాల సంగతి చూడబోతున్నారు . ఈ నేపథ్యంలోనే లక్డీకాపూల్, రాజ్‌భవన్‌‌ ప్రాంతాల్లో ఆయన పర్యటించారు. పలు నాలాలను పరిశీలించారు. ఓ డ్రైన్‌ పూర్తిగా కూడుకుపోయి ఉండగా.. మరో డ్రైన్‌లో చెత్తాచెదారం పేరుకుపోయి కనిపించింది. చాన్నాళ్ల క్రితం నుంచి ఈ పరిస్థితే ఉందనే అంచనాకు వచ్చారు రంగనాథ్‌. నగరవ్యాప్తంగా వరద నీటి ప్రవాహ వ్యవస్థను క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓ నివేదిక తయారు చేయాలనే నిర్ణయానికి వచ్చారు. బాగా ట్రాఫిక్‌ జామ్ అవుతున్న ఏరియాల్లో ఫుట్‌పాత్‌ల ఆక్రమణలపైనా రంగనాథ్ దృష్టి పెట్టారు.

Also Read: కలెక్టర్ల పనితీరుపై సీఎం రేవంత్ వద్ద రిపోర్టు.. వాళ్లపై సీరియస్

వర్షం పడితే నగరం ఆగం

పది నిమిషాలు వర్షం పడితే చాలు హైదరాబాద్‌లోని చాలా ప్రాంతాలు మునగడం, రోడ్లన్నీ చెరువుల్లా మారడం మనకు కనిపిస్తుంది. ఈ సమస్యలకు ప్రధాన కారణం సరైన వరద ప్రవాహ వ్యవస్థ లేకపోవడంతో పాటు నాలాలు, స్ట్రామ్‌ వాటర్‌ డ్రైన్లలో వ్యర్థాలు తొలగించకపోవడమేనని హైడ్రా అధికారులు గుర్తించారు. ఈ నేపథ్యంలోనే నాలాలపై దృష్టి పెట్టారు. నాలాలపై ఉన్న ఆక్రమణను తొలగించి, కొత్త నిర్మాణాలను అడ్డుకోగలిగితే వరదల నుంచి హైదరాబాద్‌ని సేవ్ చేసినట్టేనని అధికారులు భావిస్తున్నారు.

Also Read: తొలిరోజు గ్రూప్-1 పేపర్ ఎలా ఉందంటే?

ఏటా రూ.50 కోట్లు ఖర్చు

ప్రస్తుతం గ్రేటర్‌లో 1302 కిలోమీటర్ల మేర వరద ప్రవాహ వ్యవస్థ ఉంది. వీటిల్లో వ్యర్థాలను తొలగించేందుకు ఏటా 50 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారు. కానీ డ్రైన్‌ల దుస్థితి మాత్రం అలానే ఉంటుంది. ఈ నేపథ్యంలో అసలు పూడికతీత జరుగుతోందా..? లేదా..? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొన్నిచోట్ల డ్రైన్‌లు పూర్తిగా పాడైనా పట్టించుకున్న దాఖలాలు లేవు. ఇతర ప్రాంతాల్లోనూ మైనర్‌ డ్రైన్‌లు ఎలా ఉన్నాయన్నది పరిశీలించేందుకు హైడ్రా, జీహెచ్‌ఎంసీ అధికారులు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు పూడికతీత పేరిట ఎంత ఖర్చు చేశారు..? ఎంత మేర వ్యర్థాలు తొలగించారు..? అన్నదీ పరిశీలించే అవకాశముంది. కాగా, గతంలో పూడిక తీయకుండానే తీసినట్టు చూపి బిల్లులు చెల్లించినట్టు గుర్తించారు. ఈ విషయంలో పలువురు ఇంజనీర్లు, కాంట్రాక్టర్లపై కేసులు నమోదైనప్పటికీ అధికారుల తీరు మారలేదు. రంగనాథ్ ఎంట్రీతోనైనా పరిస్థితిలో మార్పు వస్తుందేమో చూడాలి.

Advertisment
Advertisment
తాజా కథనాలు