/rtv/media/media_files/2026/01/25/nampally-2026-01-25-11-42-22.jpg)
హైదరాబాద్లోని నాంపల్లిలో జరిగిన ఘోర అగ్నిప్రమాదం తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. దాదాపు 21 గంటల పాటు సాగిన ఉత్కంఠకు తెరపడుతూ, భవనంలోని సెల్లార్లో చిక్కుకున్న ఐదుగురి మృతదేహాలను సహాయక సిబ్బంది వెలికితీశారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ముగ్గురు మహిళలు ఉండటం అందరినీ కలిచివేస్తోంది. మృతులను ప్రణీత్, బేబీ, ఇంతియాజ్, అఖిల్, హబీబ్గా గుర్తించారు.
నాంపల్లి ఫర్నిచర్ షోరూంలో జరిగిన అగ్నిప్రమాదంలో 5 మృతదేహాలను గుర్తించారు. భవనం సెల్లార్ నుంచి మృతదేహాలను రెస్క్యూ టీమ్స్ వెలికితీసింది. నిన్న మధ్యాహ్నాం నుంచి హైడ్రా, పోలీసులు, ఫైర్ సహా 9 బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి.
— ABP Desam (@ABPDesam) January 25, 2026
శనివారం నాంపల్లిలోని ఫర్నిచర్ దుకాణంలో ఒక్కసారిగా మంటలు… pic.twitter.com/wm0meVCvGT
200 మంది రెస్క్యూ సిబ్బంది
మంటలు చెలరేగిన క్షణం నుండి దాదాపు 21 గంటల పాటు ఆ భవనం అగ్నిగుండంలా మారింది. లోపల దట్టమైన పొగ అలుముకోవడంతో సహాయక చర్యలకు తీవ్ర ఆటంకం కలిగింది. భవనం లోపలికి వెళ్లేందుకు వీలు లేకపోవడంతో, సుమారు 200 మంది రెస్క్యూ సిబ్బంది రాత్రంతా నిర్విరామంగా శ్రమించారు. చివరికి సెల్లార్లో ఒక గుంత తవ్వి లోపలికి ప్రవేశించేందుకు ప్రయత్నించారు. ఈ క్రమంలోనే అక్కడ విగతజీవులుగా పడి ఉన్న ఐదుగురిని గుర్తించారు.
Nampally Fire Accident Update
— PulseNewsBreaking (@pulsenewsbreak) January 25, 2026
నాంపల్లి అగ్నిప్రమాదం.. రెండు మృతదేహాలు గుర్తింపు
5 మంది మంటల్లో చిక్కుకోగా.. రెండు మృతదేహాలు బయటకు తీసిన రెస్క్యూ టీమ్
మరోవైపు.. కొన్ని గంటల నిరంతరంగా కొనసాగుతున్న సహాయక చర్యల్లో పురోగతి
సెల్లార్ లోపలికి వెళ్ళి.. అక్కడున్న క్షతగాత్రులను… pic.twitter.com/P5jVWfO5fh
ఫర్నీచర్ షాపులోని కెమికల్స్, కలప కారణంగా మంటలు వేగంగా వ్యాపించాయని, వారు తప్పించుకునే అవకాశం లేక సెల్లార్లోనే చిక్కుకుని ప్రాణాలు కోల్పోయారని అధికారులు భావిస్తున్నారు. మృతదేహాలను వెలికితీసిన అనంతరం పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. ఈ వార్త తెలియగానే మృతుల కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. 21 గంటల పాటు తమ వారు బతికి వస్తారని ఆశగా ఎదురుచూసిన వారందరికీ ఈ పరిణామం తీరని శోకాన్ని మిగిల్చింది.
Follow Us