/rtv/media/media_files/2025/03/29/wLVnmuOzyYgsgxWJGzg7.jpg)
Hyderabad metro
Hyderabad Metro Charges: హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. పెంచిన మెట్రో రైలు ఛార్జీలను సవరించింది. ఛార్జీలను 10 శాతం తగ్గిస్తూ మెట్రో యాజమాన్యం మంగళవారం నిర్ణయం తీసుకుంది. మే 24 నుంచి తగ్గిన మెట్రో ఛార్జీలు వర్తించనున్నాయి. ఛార్జీల పెంపుపై ప్రయాణికుల నుంచి ప్రతిపక్షాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత రావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. కాగా ఇటీవల కనీస ఛార్జీ రూ.10 నుంచి రూ.12కి, గరిష్ఠ ఛార్జీ రూ.60 నుంచి 75కి పెంచుతున్నట్లు హైదరాబాద్ మెట్రో రైల్ సంస్థ ప్రకటించింది. ఆ పెంచిన ఛార్జీలు ఈ నెల 17 నుంచి అమల్లోకి వచ్చాయి. ఒక్కసారిగా 20 నుంచి 25 శాతం టికెట్ ధరలు పెరగడంతో ప్రయాణికుల నుంచి విమర్శలు వచ్చాయి.
We are pleased to announce a 10% discount on the new revised fares, across all fare zones, in all three metro corridors, effective from 24th May 2025.
— L&T Hyderabad Metro Rail (@ltmhyd) May 20, 2025
🔗 For more details, visit [https://t.co/aRelKgktyX]#HyderabadMetro #LTMHyd #MetroUpdates #DiscountedFares #SmartCommute… pic.twitter.com/TXc4BSZzLd
బ్రేకింగ్
— Telangana Awaaz (@telanganaawaaz) May 20, 2025
హైదరాబాద్ మెట్రో ఛార్జీల విషయంలో దిగొచ్చిన ఎల్ అండ్ టి..
ప్రస్తుతం పెంచిన చార్జీలలో 10 శాతం రాయితీ ప్రకటిస్తూ నిర్ణయం..
మే 24వ తేదీ నుంచి వర్తించనున్న రాయితీలు..@ltmhyd pic.twitter.com/35kpoG18rX
ఇటీవల పెరిగిన మెట్రో ఛార్జీలు ఇలా..
మొదటి 2 కి.మీ. వరకు రూ. 12
2 నుంచి 4 కి.మీ. వరకు రూ. 18
4 నుంచి 6 కి.మీ. వరకు రూ. 30
6 నుంచి 9 కి.మీ. వరకు రూ. 40
9 నుంచి 12 కి.మీ. వరకు రూ. 50
12 నుంచి 15 కి.మీ. వరకు రూ. 55
15 నుంచి 18 కి.మీ. వరకు రూ. 60
18 నుంచి 21 కి.మీ. వరకు రూ. 66
21 నుంచి 24 కి.మీ. వరకు రూ. 70
24 కి.మీ. నుంచి ఆపై దూరానికి రూ. 75