/rtv/media/media_files/2025/07/18/hyd-pubs-2025-07-18-08-38-51.jpg)
డ్రగ్ పార్టీలు నిర్వహిస్తున్న పబ్బులపై ఈగిల్ టీం దర్యాప్తును ముమ్మరం చేసింది. మల్నాడు రెస్టారెంట్ సూర్యతోపాటు మరో ముగ్గురు పబ్ యజమానులతో సంబంధాలు ఉన్నట్లు ఈగల్ టీం గుర్తించారు. ఆయా పబ్లలో డ్రగ్స్ పార్టీ కోసం ప్రత్యేక ఏర్పాటు చేశారు. వాక్ కోరా, బ్రాడ్ వే పబ్, బ్రాడ్ వే యజమానులపై పోలీసులు కేసులు నమోదు చేశారు.
క్వాక్ పబ్ రాజశేఖర్, కోరా పబ్ పృథ్వి వీరమాచినేని, బ్రాడ్ వే పబ్ రోహిత్ మాదిశెట్టిపై కేసు పెట్టారు. పోలీసుల విచారణలో ఈ ముగ్గురు పబ్ యజమానులతో కలిసి డ్రగ్స్ పార్టీలు నిర్వహించినట్లు సూర్య ఒప్పుకున్నాడు. ఇంకా ఇతర పబ్ యజమానుల పాత్ర ఏమైనా ఉందా అనే కోణంలో ఈగల్ టీం విచారణ జరుపుతున్నారు.