/rtv/media/media_files/2025/07/27/musi-river-1-2025-07-27-18-41-13.jpg)
హైదరాబాద్ రాజేంద్రనగర్ ఉప్పర్పల్లిలో విషాదం చోటుచేసుకుంది. మూసీ నదిలో మునిగి బీటెక్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్ మృతి చెందాడు. అక్షిత్ రెడ్డి జీడిమెట్ల నుంచి మరో ముగ్గురు ఫ్రెండ్స్తో గూగుల్ మ్యాప్లో వెతుకుంటూ రాజేంద్రనగర్కు వచ్చాడు. స్నేహితులు అంతా కలిసి సరదాగా మూసీ నదిలోకి ఈత కొట్టడానికి దిగారు. ఈ క్రమంలో అక్షిత్ రెడ్డి ఒక్కసారిగా మూసీ నదిలో కొట్టుకుపోయాడు. అక్షిత్ రెడ్డిని కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం దక్కలేదు. వరద నీటి ఉదృతికి అక్షిత్ రెడ్డి కొట్టుకుపోయాడు. అక్షిత్ రెడ్డి కోసం DRF, రెస్క్యూ టీంలు గాలిస్తున్నాయి.
ప్రాణం తీసిన ఈత సరదా
— RK TV (@Rktvlive_) July 27, 2025
బిటెక్ 3 year విద్యార్థి మృతి
రాజేంద్రనగర్ ఉప్పర్ పల్లి మూసీ నది లో ఘటన
జీడిమెట్ల నుండి గూగుల్ మాప్ చూసుకుంటూ రాజేంద్రనగర్ కువచ్చిన అక్షిత్ రెడ్డి ముగ్గురు స్నేహితులు
సరదాగా ఈతకు దిగిన నలుగురు స్నేహితులు
ఒక్కసారిగా మూసీ నది లో గల్లంతు అయిన అక్షిత రెడ్డి pic.twitter.com/zpMeWFt98P