Hyderabad : బీజేపీ కార్పొరేటర్‌ శ్రావణ్ కుమార్‌పై క్రిమినల్ కేసు!

బీజేపీ కార్పొరేటర్‌ శ్రావణ్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమొదైంది. GHMC ఉద్యోగి వెంకటేష్ పై మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రావణ్ కుమార్‌ దాడికి దిగాడు.  దీనిపై వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై చేయిచేసుకుని, బెదిరించాడని ఫిర్యాదులో వెల్లడించాడు.  

New Update
bjp sravan kumar

bjp sravan kumar

బీజేపీ కార్పొరేటర్‌ శ్రావణ్ కుమార్‌పై క్రిమినల్ కేసు నమొదైంది. GHMC ఉద్యోగి వెంకటేష్ పై మల్కాజిగిరి కార్పొరేటర్‌ శ్రావణ్ కుమార్‌ దాడికి దిగాడు.  దీనిపై వెంకటేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తనపై చేయిచేసుకుని, బెదిరించాడని ఫిర్యాదులో వెల్లడించాడు.  మల్కాజిగిరి ఇన్‌స్పెక్టర్‌ సత్యనారాయణ వెల్లడించిన వివరాల ప్రకారం… హార్టికల్చర్‌ విభాగంలో సూపర్‌వైజర్‌గా పనిచేస్తున్న వెంకటేశ్‌కు ఓ మహిళ రోడ్డు పక్కన ఉన్న చెట్ల కొమ్మలు తొలగించాలని రెండు నెలల కిందట ఫిర్యాదు చేసింది.

చెట్ల కొమ్మలను ఎందుకు తొలగించలేదని

అయితే  మల్కాజిగిరి డివిజన్‌ కార్పొరేటర్‌  అయిన శ్రావణ్‌కుమార్‌ శివపూరిలోని తన కార్యాలయానికి సూపర్‌వైజర్‌ వెంకటేశ్‌ను పిలిపించి చెట్ల కొమ్మలను ఎందుకు తొలగించలేదని ప్రశ్నించాడు. అందుకు వెంకటేష్ స్పందిస్తూ అక్కడ 11 కేవీ కరెంట్‌ వైర్లు ఉన్నాయని.. అందుకే ఇప్పటి వరకు తొలగించలేదని బదులిచ్చాడు. ఈ క్రమంలో వెంకటేశ్‌పై కార్పొరేటర్‌ శ్రావణ్‌ చేయి చేసుకొని, బెదిరించారు. జరిగిన విషయాన్ని వెంటనే వెంకటేశ్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా, కార్పొరేటర్‌ శ్రావణ్‌ కుమార్‌ పైన క్రిమినల్‌ కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

Also read : Aghori - Sri Varshini: అఘోరీ చేతబడి చేసింది.. వర్షిణి అన్నయ్య హర్ష సంచలన వీడియో వైరల్

Advertisment
Advertisment
తాజా కథనాలు