మియాపూర్ లో సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగిని దారుణ హత్య!

మియాపూర్‌ లో బండి స్పందన (29) అనే సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగిని దారుణ హత్యకు గురైంది. పదునైన ఆయుధంతో ఆమెను విచక్షణారహితంగా పొడిచినట్లు తెలుస్తుంది.కానీ అక్కడ ఎలాంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు.

author-image
By Bhavana
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
New Update

Hyderabad : మియాపూర్‌ లో ఓ వివాహితను పదునైన ఆయుధంతో ఆమె ఇంట్లోనే హత్య చేసిన ఘటన సంచలనం రేపింది. ఏసీపీ నరసింహారావు, సీఐ దుర్గారామలింగ ప్రసాద్‌ తెలిపిన వివరాల ప్రకారం..దీప్తిశ్రీనగర్‌ సీబీఆర్‌ ఎస్టేట్‌ 3 ఏ బ్లాక్‌ లో ఉండే ఓ ప్రైవేట్‌ స్కూల్‌ ఉపాధ్యాయురాలు నమ్రత కుమార్తె బండి  స్పందన (29) సాఫ్ట్‌ వేర్‌ ఉద్యోగినిగా వర్క్‌ చేస్తుంది. 

ఇంటర్‌ చదువుతున్న సమయంలోనే అదే కాలనీకి చెందిన వినయ్‌ అనే వ్యక్తిని ప్రేమించి 2022లో పెద్దల సమక్షంలో పెళ్లి చేసుకుంది. అతను ఓ ప్రైవేట్‌ కంపెనీలో అకౌంటెంట్‌. సంవత్సరం తరువాత భర్త తనను వేధిస్తున్నాడంటూ మియాపూర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసి విడాకులకు అప్లై చేసింది. దీంతో ఆ కేసు కోర్టులో ఉంది.

సోమవారం స్పందన తల్లి పాఠశాలకు వెళ్లగా..స్పందన ఇంట్లో ఉంది. కాగా మధ్యాహ్నాం  సమయంలో ఆ ఇంటికి దగ్గరలో ఉండే వీరి బంధువు ఒకామె వచ్చి తలుపు కొట్టినప్పటికీ ఎవరూ తీయకపోవడంతో ఆమె తిరిగి వెళ్లిపోయింది. సాయంత్రం స్కూల్‌ నుంచి తిరిగి వచ్చిన తల్లి కాలింగ్‌ బెల్‌ నొక్కినప్పటికీ స్పందన తలుపు తీయలేదు.దీంతో ఆమె స్పందన మొబైల్‌ కి ఫోన్‌ చేసింది. అయినప్పటికీ ప్రయోజనం లేదు.

దీంతో ఆమె చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు పగలకొట్టి చూడగా ఆమె రక్తపు మడుగులో శవమై ఉంది. పదునైన ఆయుధంతో ఆమెను విచక్షణారహితంగా పొడిచినట్లు తెలుస్తుంది. కానీ అక్కడ ఎలాంటి ఆయుధం లభించలేదని పోలీసులు తెలిపారు.

కేసు నమోదు చేసుకున్న పోలీసులు అన్ని కోణాల్లో విచారిస్తున్నామని ఏసీపీ తెలిపారు. అపార్ట్‌మెంట్ తో పాటు పరిసర ప్రాంతాల్లోని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు.

Also Read: ఆసుపత్రిలో చేరిన సూపర్‌ స్టార్ !

 

#hyderabad #killed #software-employee
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe