Telangana: ఆదిలాబాద్‌లో హోటళ్లపై పౌర సరఫరా అధికారుల తనిఖీలు

ఆదిలాబాద్‌ పట్టణంలోని పౌర సరఫరాల అధికారులు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లపై దాడులు నిర్వహించారు. ఆయా హోటళ్లలో వాణిజ్య సిలెండర్లకు బదులు వాడుతున్న 20కి పైగా గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నారు. మళ్లీ ఇవి వాడితే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు.

author-image
By B Aravind
New Update
Food Safety Officials

పౌర సరఫరాల అధికారులు హోటళ్లపై దాడులు చేస్తూ కొరడా ఝళిపిస్తున్నారు. తాజాగా ఆదిలాబాద్‌ పట్టణంలోని హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లపై దాడులు నిర్వహించారు. పలు హోటళ్లు, టిఫిన్‌ సెంటర్లలో వాణిజ్య సిలిండర్లకు బదులు గృహ వినియోగ సిలిండర్లు వాడుతూ ప్రభుత్వ రాయితీని పక్కదారి పట్టిస్తున్నట్లు అధికారుల దృష్టికి వచ్చింది. దీనిపై జిల్లా కలెక్టర్‌ రాజర్షి షా సీరియస్ అయ్యారు. ఆయన ఆదేశాల మేరకు పట్టణంలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు ఆయా హోటళ్లలో తనిఖీ చేశారు. దాదాపు 20కి పైగా గృహ వినియోగ సిలిండర్లు స్వాధీనం చేసుకున్నారు. మరోసారి రాయితీ సిలెండర్లు వాడితే కేసులు నమోదు చేస్తామని పౌర సరఫరాల అధికారి వాజిద్‌ అలీ తెలిపారు. 

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

మెఘాతో మీకున్న మతలాబు ఏంటి?.. కవిత సంచలన ఆరోపణలు!

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్.. 90 శాతం పంప్‌హౌస్‌లు నిర్మించిన మెఘా సంస్థ యజమానికి ఎందుకు ఇవ్వదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదని ఫైర్ అయ్యారు.

New Update

కేసీఆర్‌కు నోటీసులు ఇచ్చిన కాళేశ్వరం కమిషన్.. 90 శాతం పంప్‌హౌస్‌లు నిర్మించిన మెఘా సంస్థ యజమానికి ఎందుకు ఇవ్వదని ఎమ్మెల్సీ కవిత ప్రశ్నించారు. సుంకిశాల రిటైనింగ్ వాల్ కూలినా ఆ సంస్థను బ్లాక్ లిస్ట్ లో పెట్టలేదన్నారు. ఆ తర్వాత కూడా అనేక ప్రాజెక్టులు కట్టబెట్టి ప్రజల సొమ్మును దోచుకునేందుకు మేఘా సంస్థకు సహకరిస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‎కు రక్షణ కవచంలా ఉంటామన్నారు. నీళ్లు తీసుకురావడం కేసీఆర్ చేసిన తప్పా? అని ప్రశ్నించారు. కాళేశ్వరం ప్రాజెక్టు అంటే కేవలం మూడు బ్యారేజీలేనా..? అని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కావాలనే కేసీఆర్‌ను లక్ష్యంగా చేసుకుంటోందన్నారు. -బనకచర్ల ప్రాజెక్ట్‌పై ఈటల ఎందుకు మాట్లాడటం లేదో చెప్పాలన్నారు. 

Advertisment
Advertisment