తెలంగాణలో ఈ మద్య ఎక్కువగా అగ్ని ప్రమాదాలు సంభవిస్తున్నాయి. రోజుల వ్యవధిలోనే ఈ ప్రమాదాలు సంభవించడం గమనార్హం. మొన్నామధ్య అబిడ్స్లో అగ్నిప్రమాదం జరిగింది. ఆ తర్వాత మాదాపూర్లోని సత్వ అనే సాఫ్ట్వేర్ కంపెనీలో మరో అగ్ని ప్రమాదం జరిగింది. అలాగే మాదాపూర్లోని ఖానామెట్లో సైతం భారీగా అగ్ని ప్రమాదం జరిగింది. ఇవి మరువక ముందే ఇప్పుడు ఓరి బాబోయ్ అనేలా మరో ప్రమాదం జరిగింది. హైదరాబాద్లో అగ్ని ప్రమాదం జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదంమేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు..పొగలు, మంటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు..ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. pic.twitter.com/0PsZt0YAp4 — Telangana Chitralu (@tgchitralu) January 3, 2025 హైదరాబాద్లోని జీడిమెట్ల పారిశ్రామికవాడ పరిధిలోని దూలపల్లిలో ఊహించని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ప్రమాద సమయంలో రిషిక కెమికల్ గోడౌన్లో మంటలు ఎగిసి పడుతున్నాయి. వాటి మధ్య దట్టమైన పొగలు చుట్టూ ఉన్న ప్రజల్ని భయబ్రాంతులకు గురిచేస్తుంది. ఆ మంటలతో స్థానికులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరకున్నారు. మంటలను అదుపు చేసేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. ఈ ప్రమాదంతో అక్కడ భారీగా ట్రాఫిక్ స్తంభించింది. జీడిమెట్ల పారిశ్రామికవాడలో ఘోర అగ్ని ప్రమాదంమేడ్చల్ - దూలపల్లిలోని రిషిక కెమికల్ గోడౌన్లో భారీగా ఎగిసిపడుతున్న మంటలు..పొగలు, మంటలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న స్థానికులు..ఘటనా స్థలానికి చేరుకొని మంటలార్పుతున్న అగ్నిమాపక సిబ్బంది. pic.twitter.com/eMgOhvhZzE — Telugu Scribe (@TeluguScribe) January 3, 2025