Harish Rao : ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు కు ఊరట

ఫోన్ టాపింగ్ కేసులో మాజీ మంత్రి హరీశ్ రావు, మాజీ డీసీపీ రాధాకిషన్ రావులకు ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్ లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే విధించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు అరెస్టు చేయవద్దు ఆదేశాలు జారీ చేసింది.

author-image
By Madhukar Vydhyula
New Update
Harish Rao

Harish Rao

 Harish Rao :  ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో మాజీ మంత్రి హరీశ్‌రావు, రాధా కిషన్‌రావుకు హైకోర్టులో ఊరట లభించింది. పంజాగుట్ట పీఎస్‌లో నమోదైన కేసు దర్యాప్తుపై హైకోర్టు స్టే ఇచ్చింది. పిటిషన్‌పై తదుపరి విచారణ చేపట్టే వరకు ఎలాంటి చర్యలు చేపట్టవద్దని న్యాయస్థానం స్టే విధించింది. తన ఫోన్‌ ట్యాప్‌ చేశారంటూ రియల్టర్‌ చక్రధర్‌ ఫిర్యాదు మేరకు పంజాగుట్ట పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసు నమోదుచేశారు. ఈ కేసులో హరీశ్‌రావు వద్ద గతంలో పనిచేసిన కంప్యూటర్‌ ఆపరేటర్‌ను పోలీసులు అరెస్టు చేశారు.

Also Read : Raj Tarun-Lavanya Case: ఓవైపు రాజ్ ని ప్రేమిస్తూనే మస్తాన్ సాయితో బెడ్ రూమ్ లో.. లావణ్య గురించి ఫ్రెండ్ ప్రీతీ..

ఫోన్ టాపింగ్‌ తో పాటు బెదిరింపులకు పాల్పడిన ఘటనలో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. చక్రధర్ గౌడ్ ఫోన్ ట్యాపింగ్ చేసిన ఘటనలో ముగ్గురు నిందితులు వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు అరెస్ట్ అయ్యారు. వీరు చక్రధర్ గౌడ్‌కు బెదిరింపు కాల్స్, మెసేజ్‌లు పంపుతూ డబ్బులు వసూలు చేయడానికి ప్రయత్నించినట్లు పోలీసులు గుర్తించారు.

Also Read:  Rishab Shetty: ఫ్యాన్స్ కి గూస్ బంప్స్.. ఛత్రపతి శివాజీ మహారాజ్ గా రిషబ్ శెట్టి.. పోస్టర్ వైరల్

ఎఫ్‌ఐఆర్‌ క్వాష్‌ చేయాలని హరీశ్‌రావు, రాధాకిషన్‌రావు పిటిషన్‌ దాఖలు చేయగా.. అరెస్టు చేయొద్దని గతంలోనే హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈకేసులో ప్రభుత్వం తరఫున వాదనల కోసం లాయర్‌ సిద్ధార్థ లూథ్రా వస్తారని పీపీ తెలిపారు. మరో కేసులో లూథ్రా బిజీగా ఉన్నందున వాదనలకు పీపీ సమయం కోరారు. దీంతో తదుపరి విచారణను హైకోర్టు మార్చి 3వ తేదీకి వాయిదా వేసింది.
 ఈ కేసుకు సంబంధించి మాజీ మంత్రి హరీష్ రావు ఏ1, రాధా కిషన్ రావు ఏ2గా పోలీసులు పేర్కొన్నారు. చక్రధర్ గౌడ్ కు బెదిరింపు కాల్స్, మెసేజ్ లు చేస్తూ డబ్బుల వసూళ్లకు పాల్పడ్డ ముగ్గురు నిందితులు.. వంశీకృష్ణ, సంతోష్ కుమార్, పరశురాములు. ఈ ముగ్గురు కలిసి ఒక రైతు డాక్యుమెంట్స్ తో సిమ్ కార్డు కొనుగోలు చేశారు. ఫేక్ సిమ్ కార్డును ఉపయోగించి చక్రధర్ గౌడ్ కు బెదిరింపు మెసేజ్ లు చేశారు. సిద్దిపేట నియోజకవర్గంలో సామాజిక కార్యక్రమాల్లో చక్రధర్ గౌడ్ పాల్గొన కుండా బెదిరించినట్లు పోలీసుల విచారణలో తేలింది.

Also Read: Anand Mahindra: భారత్‌ లో టెస్లా..ఆనంద్‌ మహీంద్రా కీలక వ్యాఖ్యలు!

కాంగ్రెస్‌ నాయకుడు చక్రధర్‌గౌడ్‌కు సంబంధించిన రెండో ఫోన్‌ట్యాపింగ్‌ కేసులో ఏ4, ఏ5గా ఉన్న తొడుపునూరి సంతో్‌షకుమార్‌, బండి పరశురాములు బెయిల్‌ పిటిషన్‌లపై వేగంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని నాంపల్లి కోర్టుకు హైకోర్టు ఆదేశాలు జారీచేసింది. ఈ కేసులో ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే పంజాగుట్ట పోలీసులు తమను వేధిస్తున్నారంటూ వారు చేసిన ఫిర్యాదు మేరకు ఈ ఆదేశాలు ఇచ్చింది. వారు సమర్పించిన లంచ్‌మోషన్‌ పిటిషన్‌లపై విచారణ చేపట్టిన జస్టిస్‌ బీ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం ట్రయల్‌ కోర్టుకు ఈ ఆదేశాలు ఇచ్చింది.

Also Read:  ఏపీలో వీసీల నియామకం.. యూనివర్సిటీల వారీగా లిస్ట్ ఇదే!

Advertisment
Advertisment