/rtv/media/media_files/2025/08/10/mynampally-2025-08-10-18-53-27.jpg)
తెలంగాణలో అధికార కాంగ్రెస్ కు బిగ్ షాక్ తగిలింది. సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో వర్గపోరు తారాస్థాయికి చేరింది.ఫార్మర్స్ ఫస్ట్ ఫౌండేషన్ అధ్యక్షుడు, కాంగ్రెస్ నేత చక్రధర్ గౌడ్ ఆ పార్టీకి కొద్దీసేపటి క్రితమే రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కు పంపించారు. వెంటనే తన రాజీనామాను ఆమెదించాలని ఆ లేఖలో కోరారు. సిద్దిపేటకు ఎలాంటి సంబంధం లేని మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు వ్యవహారంతోనే తాను రాజీనామా చేస్తున్నట్లుగా చక్రధర్ గౌడ్ వెల్లడించారు.
మైనంపల్లి VS చక్రధర్ గౌడ్
— Mirror TV (@MirrorTvTelugu) August 10, 2025
సిద్దిపేట కాంగ్రెస్ పార్టీలో తారాస్థాయికి చేరిన వర్గపోరు
కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన సిద్దిపేట కాంగ్రెస్ నాయకుడు చక్రధర్ గౌడ్
మైనంపల్లి చరిత్ర అంతా బయటపెట్టిన చక్రధర్
మైనంపల్లి ఒక గుండా, రౌడీ..డబ్బు మదంతో చెలరేగిపోతున్నాడు
నువ్వు నీ కొడుకు… pic.twitter.com/tZzYorO7rC
బీజేపీలో చేరే అవకాశం
తనతో తిరిగే కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు పెట్టడం తనను బాధించిందని తెలిపారు.మైనంపల్లి త్వరలో బీజేపీలో చేరే అవకాశం ఉందని కూడా చక్రధర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ పార్టీలో తనకు గౌరవం లభించలేదని భావించి, పార్టీని వీడుతున్నట్లు గౌడ్ స్పష్టం చేశారు. ఇంతకాలం తనను ఆదరించిన సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, సిద్ధిపేట కాంగ్రెస్ కార్యకర్తలకు చక్రధర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరతారనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు.