Telangana Crime : బీఎస్సీ విద్యార్థి దారుణ హత్య!

ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న జితేందర్‌ అనే విద్యార్థి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొందరు గుర్తు తెలియని వ్యక్తులు అతనికి మద్యం తాగించి.. దాడి చేసి చంపేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

author-image
By Bhavana
Wife Murder: అనుమానంతో భార్యను కడతేర్చిన భర్త
New Update

Adilabad: ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్న విద్యార్థి అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. గుర్తు తెలియని వ్యక్తులు మద్యం తాగించి దాడి చేయడంతో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ శనివారం విద్యార్ధి  మృతి చెందాడు. ఈ విషయం గురించి తెలుసుకున్న డీఎస్పీ జీవన్‌ రెడ్డి, ఆదిలాబాద్‌ రూరల్‌ సీఐ ఫణిధర్, మావల ఎస్సై విష్ణు వర్ధన్‌ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. 

జరిగిన సంఘటన గురించి తోటి విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థి కుటుంబ సభ్యులు, తోటి స్నేహితుల కథనం ప్రకారం.. నార్నూర్‌ మండలంలోని చోర్‌గావ్‌కు చెందిన రాథోడ్‌ ధన్‌సింగ్‌, మీరాబాయిల మూడవ కుమారుడు రాథోడ్‌ జితేందర్‌  ప్రభుత్వ గిరిజన బాలుర పోస్ట్‌ మెట్రిక్‌ వసతి గృహంలో ఉంటూ రిమ్స్‌ ఆసుపత్రిలో బీఎస్సీ ఓటీటీ చదువుకుంటున్నాడు. 

శుక్రవారం రాత్రి వసతి గృహానికి జితేందర్‌ ఫ్రెండ్‌  రావడంతో అతనితో కాసేపు బయటకు వచ్చి మాట్లాడి వెళ్లాడు. అనంతరం జితేందర్‌ వసతి గృహం లోపలికి వెళ్తున్న క్రమంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు అక్కడికి వచ్చి పిలిచారు. వారి వద్దకు వెళ్లేందుకు జితేందర్‌ నిరాకరించాడు. దాంతో బలవంతంగా జితేందర్‌ను కొందరు వ్యక్తులు తీసుకొని వసతి గృహం ఎదురుగా నిర్మాణంలో ఉన్న సమీకృత బీసీ భవనంలోకి తీసుకుని వెళ్లారు. అక్కడ మద్యం సేవించాలని వారు బలవంతం చేయగా జితేందర్ నిరాకరించాడు. 

దీంతో వారు జితేందర్‌ కి బలవంతంగా మద్యం తాగించి ఆ సీసాతో మృతుని ఛాతి, తలపై, కాళ్లపై, శరీర భాగాలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. కాగా జరిగిన విషయాన్ని తనకు జితేందర్‌ ఫోన్‌ ద్వారా తెలిపాడని మృతుని బంధువు నగేష్‌ తెలిపారు. అక్కడికి చేరుకుని చికిత్స కోసం ముందుగా జిల్లా కేంద్రంలోని రిమ్స్‌ ఆసుపత్రికి తరలించామని పేర్కొన్నారు.

మెరుగైన వైద్యం కోసం జితేందర్‌ ని శనివారం మధ్యాహ్నం జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేట్‌ ఆసుపత్రిలో చేర్పించినట్టు చెప్పాడు. ఈ క్రమంలో పరిస్థితి విషమించి సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, విద్యార్థి సంఘాల నాయకులు పెద్ద ఎత్తున స్థానిక ప్రైవేట్ ఆసుపత్రి వద్ద ఆందోళన చేపట్టారు. వసతిగృహం వార్డెన్, అధికారులు నిర్లక్ష్యంగా ఉన్నారని ఆరోపించారు. తన కొడుకుకు బలవంతంగా మద్యంలో పురుగుల మందు కలిపి తాగించి దాడి చేసి హత్య చేశారని తల్లిదండ్రులు ఆరోపిపస్తున్నారు. ఇంతటి దారుణానికి ఒడిగట్టిన నిందితులను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.

Also Read :  రన్నింగ్‌ బస్సులో ప్రయాణికురాలి పై అత్యాచారం!

#killed #telangana-crime #nursing-student
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి