ఫోర్త్ సిటీలో సీఎం రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యులు 2 వేల ఎకరాలు కొన్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సంచలన ఆరోపణలు చేశారు. రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ ప్యాలెస్ నుంచి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. హెలీకాప్టర్లను షేర్ ఆటోల కంటే దారుణంగా కాంగ్రెస్ మంత్రులు వాడుతున్నారన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తరువాత ఇప్పటివరకు చేసిన పర్యటనల వివరాలపై శ్వేతపత్రం విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. కాంగ్రెస్ పార్టీ పాటలో ఉన్నట్లు రేవంత్ రెడ్డి ఆనాటి రోజులు తేస్తున్నాడని ఎద్దేవా చేశారు.
అందాల పోటీలకు 250 కోట్లు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి డబ్బులు లేవా
— KTR News (@KTR_News) May 6, 2025
నిన్ను కోసుకొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావ్
– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ pic.twitter.com/SY6wcVTDz5
చేతకాకపోతే తప్పుకో..
పరిపాలన చేతకాకపోతే తప్పుకోవాలని సూచించారు. కేసీఆర్ గురించి ఇక మీదట అడ్డగోలుగా మాట్లాడితే రేవంత్ రెడ్డి నాలుక చీరేస్తామని హెచ్చరించారు. అందాల పోటీలకు రూ.250 కోట్లు ఖర్చు పెట్టడానికి డబ్బులు ఉన్నాయి కానీ.. రిటైర్ అయిన ఉద్యోగులకు ఇవ్వడానికి లేవా అని ప్రశ్నించారు. నిన్ను కోసుకొని తినడం కాదు నువ్వే రాష్ట్రాన్ని పీక్కొని తింటున్నావని రేవంత్ పై ఫైర్ అయ్యారు కేటీఆర్. మూడు సంవత్సరాల కింద రాహుల్ గాంధీ ప్రకటించిన రైతు డిక్లరేషన్ నేటికి కూడా అమలు కాలేదని ఫైర్ అయ్యారు.
ఫోర్త్ సిటీలో 2000 ఎకరాలు ఎట్లా కొన్నావు రేవంత్ రెడ్డి ?
— Telugu Scribe (@TeluguScribe) May 6, 2025
నీ అన్నదమ్ములు, నీ బామ్మర్ది, నీ కుటుంబ సభ్యులు అందరి ఆదాయం పెంచుకున్నావు, కానీ రాష్ట్ర ఆదాయం ఎందుకు పెరగలేదు –కేటీఆర్ pic.twitter.com/unJN5BmI35
(cm revanth | telugu-news | telugu breaking news)