యాదాద్రి ఆలయంలో కౌశిక్‌రెడ్డి ఫొటోషూట్.. మండిపడుతున్న భక్తులు

బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కుటుంబం సమేతంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామివారి దర్శనానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి.. దర్శనం అనంతరం ఆలయ మాఢ వీధుల్లో ఫొటోషూట్‌, రీల్స్ చేయడంపై భక్తులు మండిపడుతున్నారు.

author-image
By srinivas
New Update
Koushik Reddy

Padi Kaushik Reddy : బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. దేవస్థానంలో భార్య, కూతురుతో ఫొటో షూట్ నిర్వహించిన తీవ్ర విమర్శలపాలవుతున్నారు. పవిత్రమైన ప్రదేశంలో ఇలాంటి పిచ్చిపనులేంటని భక్తులు కౌశిక్ రెడ్డిపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒక బాధ్యతాయుత పదవిలో ఉన్న కౌశిక్.. ప్రజలకు ఆదర్శంగా ఉండాల్సిందిపోయి వార్తల్లో నిలవడం కోసం దిగాజారిపోతున్నాడని పలువురు నెటిజన్లు సైతం విమర్శలు గుప్పిస్తున్నారు. ఇంతకు ఏం జరిగిందనే వివరాల్లోకి వెళితే..

Also Read :  ఢిల్లీ బాంబ్ పేలుడు వెనక ఉగ్ర కుట్ర.. కీలక విషయాలు వెల్లడించిన ఎన్ఐఏ!

ఇది కూడా చదవండి: Ind Vs Nz: కేఎల్ రాహుల్‌పై వేటు.. జట్టులోకి బెంగాల్ బ్యాటర్!

ఆదివారం కుటుంబం సమేతంగా యాదాద్రి లక్ష్మీనర్సింహస్వామివారి దర్శనానికి వెళ్లిన కౌశిక్ రెడ్డి.. దర్శనం అనంతరం ఆలయ మాఢ వీధుల్లో ఫొటోషూట్‌, రీల్స్ చేశారు. ఆలయ మాఢ వీధుల్లో తన భార్య, కూతురితో కలిసి రీల్స్ చేస్తూ ఫొటోలకు ఫోజులిచ్చారు. అంతేకాదు వీటిని సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా.. వైరల్ కావడంతో నెటిజన్లనుంచి తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యేగా ఉండి ఆలయ ప్రతిష్ట దెబ్బతీసేలా వ్యవహరించారని కామెంట్లు చేస్తున్నారు. దీనిపై ఆలయ అధికారులు ఎలా స్పందిస్తారోననే అంశం ఆసక్తికరంగా మారింది. మరోవైపు ప్రస్తుతం కౌశిక్ రెడ్డి రీల్స్ వైరల్ అవుతుండగా.. బీఆర్ఎస్ శ్రేణులు, అతని అభిమానులు ఫుల్ ఖుష్‌ అవుతూ పొగిడేస్తున్నారు. 

Also Read :  ఆరోగ్యకరమైన స్నాక్స్‌.. ఆకలి అస్సలు ఉండదు

Koushik Reddy & Wife

ఇది కూడా చదవండి: హార్పర్స్ బజార్ అవార్డు వేడుకల్లో.. అనన్య అందాలు చూస్తే మతిపోవాల్సిందే !

Advertisment
Advertisment
తాజా కథనాలు