/rtv/media/media_files/2024/11/03/FKc12dhbDoqwS8YQq06L.jpg)
గ్రామాల్లో రెవెన్యూ వ్యవస్ధను బలోపేతం చేయాలన్న లక్ష్యంతో ప్రతి రెవెన్యూ గ్రామానికి ఒక గ్రామ పరిపాలన అధికారిని నియమిస్తున్నామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. ఇందుకోసం గతంలో VRO,VRAలుగా పనిచేసినవారికి జీపీవోలుగా అవకాశం కల్పించడానికి ప్రత్యేక పరీక్ష నిర్వహించడం జరిగింది. ఇందులో 3,454 మంది అర్హత సాధించారని తెలిపారు. రెవెన్యూ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తి మేరకు విఆర్వో, విఎవో లకు మరో అవకాశం కల్పించి ఇందుకు సంబంధించి అర్హత పరీక్ష త్వరలో నిర్వహించాలని నిర్ణయించినట్లు వెల్లడించారు.
సోమవారం నాడు డాక్టర్ బి ఆర్ అంబేద్కర్ సచివాలయంలో రెవెన్యూ కార్యదర్శి డి ఎస్ లోకేష్ కుమార్తో కలిసి రెవెన్యూ సంఘాలతో సమావేశమై ప్రతి రెవెన్యూ గ్రామానికి రెవెన్యూ అధికారిని నియమించడంపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గత ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్ధను చిన్నాభిన్నం చేసిందని VRO,VRA వ్యవస్థను రద్దు చేసింది. సామాన్యులకు రెవెన్యూ సేవలను దూరం చేసిందన్నారు. రాష్ట్రంలో భూ సమస్యల పరిష్కారం లక్ష్యంగా భూ భారతి చట్టాన్ని తీసుకురావడం జరిగిందని, అదేవిధంగా సామాన్య ప్రజలకు రెవెన్యూ సేవలను చేరువ చేయడానికి ప్రజా కోణంలో నిర్ణయాలు తీసుకొని గ్రామ పాలనా అధికారుల ఏర్పాటుకు శ్రీకారం చుట్టామన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్.