Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి

అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. తాజాగా తెలంగాణకు చెందిన మరో యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతురాలిని గుంటపల్లి సౌమ్యగా గుర్తించారు. ఈమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదిగిరి పల్లె.

Telangana: అమెరికాలో రోడ్డు ప్రమాదం.. తెలంగాణ యువతి మృతి
New Update

Telugu Girl Died in America: అమెరికాలో భారతీయ విద్యార్థుల వరుస మరణాలు కలకలం రేపుతున్నాయి. హత్యలు, రోడ్డు ప్రమాదం, జలపాతంలో కొట్టుకుపోవడం ఇలా వేరు వేరు ఘటనల్లో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోంది. తాజాగా తెలంగాణకు చెందిన మరో యువతి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. మృతురాలిని గుంటపల్లి సౌమ్యగా (Soumya) గుర్తించారు. ఈమె స్వస్థలం యాదగిరిగుట్ట శివారులోని యాదిగిరి పల్లె.


ఆమె కుటుంబ సభ్యులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సౌమ్య రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తోంది. అంతలోనే అతివేగంగా వచ్చిన ఓ కారు ఢీకొట్టింది. దీంతో ఆమె అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయింది. సౌమ్య చదువుకుంటూనే మరోవైపు పార్ట్ టైం జాబ్ కూడా చేస్తోంది. సౌమ్య ఉన్నత స్థాయికి ఎదుగుతుందని ఆమె తల్లిదండ్రులు ఎన్నో కలలు గన్నారు. కానీ చివరికి ఇలా రోడ్డు ప్రమాదంలో తమ కూతురు మృతి చెందడంతో కన్నీరుమున్నీరవుతున్నారు.

Also Read: వీడెవడండి బాబు.. ఏకంగా అమ్మవారి హుండీనే ఎత్తుకెళ్లాడు..

#telugu-news #telangana-news #accident
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి