Telangana Minister Seethakka: రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తామని రాష్ట్ర పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి సంస్థ, స్త్రీ-శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క(Seethakka) అన్నారు. శనివారం ములుగు(Mulugu) జిల్లాలోని బండారు పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన గ్రామ సభలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ఆమె.. ప్రజా పాలన(Prajapalana) సభలో దరఖాస్తులను సమర్పించలేని వారు.. జనవరి 6వ తేదీ వరకు తమ అప్లికేషన్ ఫామ్స్ని పంచాయతీ కార్యదర్శికి అందజేయాలని సూచించారు. గ్రామంలోని ప్రతి కుటుంబం దరఖాస్తు చేసుకునే విధంగా పంచాయతీ కార్యదర్శి ప్రత్యేక శ్రద్ధ వహించాలని మంత్రి సూచించారు. అలాగే, ప్రజాపాలనా దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమంలో ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అధికారులు వెంటనే పరిష్కరించాలని సూచించారు మంత్రి సీతక్క. ప్రజలకు ఇచ్చిన మాట మేరకు ప్రభుత్వం ఏర్పడిన మొదటి రోజు నుంచి ఆరు గ్యారెంటీ పథకాలు అమలు చేసేందుకు చిత్తశుద్ధితో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు సీతక్క.
పూర్తిగా చదవండి..Telangana: వారందరికీ 6 గ్యారెంటీలు.. మంత్రి సీతక్క కీలక కామెంట్స్..
ప్రజాపాలన దరఖాస్తులపై కీలక కామెంట్స్ చేశారు మంత్రి సీతక్క. ప్రజా పాలన కార్యక్రమంలో దరఖాస్తులు సమర్పించలేకపోయిన వారు జనవరి 6వ తేదీ వరకు గ్రామాల్లో గ్రామ కార్యదర్శికి అందజేయవచ్చునని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పథకాలు అందుతాయన్నారు.
Translate this News: