Telangana : రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి..!

రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రుణమాఫీ మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. కుటుంబ సభ్యుల పేరిట రుణాలు ఎంత ఉన్నా.. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలి ప్రభుత్వం నిర్ణయించుకుంది.

Telangana : రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు పూర్తి..!
New Update

Crop Loan Waiver Scheme : రైతు రుణమాఫీ (Rythu Runa Mafi) పై కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) కసరత్తు పూర్తి అయినట్లు తెలుస్తోంది. ఇవాళ లేదా రేపు రైతు రుణమాఫీ మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు సమాచారం. పీఎం కిసాన్ యోజన (PM Kisan Yojana) మార్గదర్శకాలు అమలు చేసే అవకాశం ఉంది. కుటుంబ యూనిట్‌ వారిగా రుణమాఫీ చేయనున్నట్లు తెలుస్తోంది. కుటుంబంలో వారి పేరిటి రుణాలు ఎంత ఉన్నా.. గరిష్ఠంగా రూ.2 లక్షల వరకు మాఫీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించుకుంది. రేషన్‌కార్డు, వ్యవసాయ శాఖ వద్ద ఉన్న డేటా ఆధారంగా రుణమాఫీ జరగనుంది.

Also Read: సముద్ర గర్భంలో రామసేతు నిజమే: ఇస్రో!

దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదలైన వెంటనే రైతు జాబితా తయారీ అవుతుంది. బ్యాంకు అధికారులతో కలిసి రైతు జాబితా తయారు చేయనున్నారు. చివరగా గ్రామ సభలో చర్చించాక తుది నిర్ణయం తీసుకుంటారు. గతంలో అనుసరించిన పద్ధతిలోనే అమలు చేయనున్నారు. రుణమాఫీ..రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు, కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులను వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. అయితే చిన్నస్థాయి ప్రభుత్వ ఉద్యోగులకు రుణమాఫీ చేయాలా..? వద్దా..? అనే దానిపై పరిశీలన జరుగుతోంది. అలాగే పంటల కోసం బంగారం తాకట్టు పెట్టి తీసుకున్న రుణాలు సైతం మాఫీకి నిర్ణయించినట్లు తెలుస్తోంది.

Also Read: కేఫ్‌ లో భారీ పేలుడు.. 20 మంది మృతి!

#crop-loan-waiver-scheme #rythu-runa-mafi #congress-government #pm-kisan-yojana
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe