రేపు తెలంగాణకు మోదీ, అమిత్ షా, నడ్డా.. షెడ్యూల్ ఇదే!

తెలంగాణలో బీజేపీ అగ్రనేతలు మోదీ, అమిత్ షా, నడ్డా మరోసారి పర్యటించనున్నారు. ఒకేరోజు ముగ్గురు మూడు వేరు వేరు సభల్లో ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు.

New Update
Mood Of the Nation Survey 2024: ఈసారి కూడా బీజేపీదే హవా..మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వే 2024

Telangana Elections 2023: తెలంగాణలో బీజేపీ (BJP) స్పీడ్ పెంచింది. ప్రచారంలో భాగంగా అగ్రనేతలు తెలంగాణ ప్రచారంలో దింపింది. రేపు తెలంగాణలో మరోసారి ప్రధాని మోదీ (PM Modi), అమిత్ షా (Amit Shah), నడ్డా (JP Nadda) పర్యటించనున్నారు. దీనికి సంబంధించిన షెడ్యూల్ ను బీజేపీ ప్రకటించింది. రేపు బాన్సువాడ, జుక్కల్ ఎన్నికల ప్రచారంలో జేపీ నడ్డా పాల్గొననున్నారు.

ALSO READ: పెన్షన్ రూ.5000.. కేసీఆర్ సంచలన ప్రకటన!

అమిత్ షా షెడ్యూల్ వివరాలు:

* రేపు ఉదయం 10: 30 కి బేగంపేట్ విమానాశ్రయం.
* 11:15 నిమిషాలకు హుజూరాబాద్ బహిరంగ సభ.
* 12:40 కి పెద్దపల్లి బహిరంగ సభ.
* మధ్యాహ్నం 2గంటలకు మంచిర్యాల బహిరంగ సభ.
* 4:10 నిమిషాలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ఢిల్లీ తిరుగు ప్రయాణం.

ప్రధాని మోదీ పర్యటన వివరాలు:

* రేపు ఉదయం 10:25 కి తిరుపతి నుంచి బయల్దేరనున్న మోడీ.
* 11:40 కి బేగంపేట్ విమానాశ్రయం.
* 12:45 మహబూబాబాద్ సభ.
* 2:30 కరీంనగర్ బహిరంగ సభ.
* 4:15 బేగంపేట్ విమానాశ్రయం.
* 4:45 ఆర్టీసీ క్రాస్ నుంచి కాచిగూడ చౌరస్తా వరకు రోడ్ షో.
* 6:35 వరకు ఎన్టీఆర్ స్టేడియం.
* 7:30 కి బేగంపేట్ విమానాశ్రయం నుంచి బెంగళూర్ వెళ్లనున్న ప్రధాని.

ALSO READ: కొత్త రేషన్ కార్డులపై కేటీఆర్ సంచలన ప్రకటన!

Advertisment
తాజా కథనాలు