TS DSC Notification: తెలంగాణలో రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే?

తెలంగాణ టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భర్తీచేసే టీచర్ల పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. మే 3 వ వారంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించకున్నారు.

TS DSC Notification: తెలంగాణలో రేపే మెగా డీఎస్సీ నోటిఫికేషన్.. మొత్తం ఎన్ని పోస్టులు అంటే?
New Update

TS DSC Notification: తెలంగాణ (Telangana) టీచర్‌ పోస్టుల (Teacher posts) భర్తీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం గురువారం డీఎస్సీ నోటిఫికేషన్‌ (DSC Notification)  విడుదల చేసేందుకు నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో భర్తీచేసే టీచర్ల పోస్టుల సంఖ్యను కూడా పెంచింది. మే 3 వ వారంలో ఈ పరీక్షను నిర్వహించాలని అధికారులు నిర్ణయించకున్నారు.

సుమారు పది రోజుల పాటు డీఎస్సీ పరీక్షలు నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన పరీక్షల షెడ్యూల్‌ ని కూడా అధికారులు ఖరారు చేసినట్లు సమాచారం.

రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 11, 062 టీచర్ పోస్టులకు అనుమతి కూడా లభించినట్లు అధికారులు వెల్లడించారు. దీంతో నోటిఫికేషన్‌ రిలీజ్‌ చేయడమే లేటు. ముందుగా ఫిబ్రవరి 28 బుధవారమే నోటిఫికేషన్ ఇవ్వాలని అధికారులు భావించారు. కానీ కొన్ని టెక్నికల్‌ ఇష్యూష్‌ తో పాటు మరికొన్ని తుది మెరుగులు దిద్దుకోవడం కోసం మరో రోజు ఆలస్యం అయ్యింది.

2023 లో 5,089 పోస్టులకు నోటిఫికేషన్‌ ఇచ్చారు. వాటితో కలిపి ఇప్పుడు కొత్త పోస్టులు అన్ని కలుపుకొని డీఎస్సీ నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో పాత నోటిఫికేషన్‌ ను రాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసింది.గతం లో వచ్చిన దరఖాస్తులను కూడా పరిగణనలోకి తీసుకునేలా సాఫ్ట్‌ వేర్‌ ను రూపొందించారు.

రాష్ట్రవ్యాప్తంగా విద్యాశాఖలో మొత్తం 21 వేల టీచర్‌ పోస్టులు ఉన్నట్లు తెలిసింది. వాటిల్లో ఎస్జీటీలను నేరుగా నియమించడానికి వీలుంది. కాబట్టి ప్రస్తుతం డీఎస్సీలో ప్రకటించే 11,062 పోస్టుల్లో 6,500 పోస్టులు ఎస్జీటీలే ఉండే వీలు ఉంది.

స్కూల్ అసిస్టెంట్‌ ఖాళీలపై మరికొంత స్సష్టత రావాల్సి ఉంది. ప్రమోషన్స్‌ ద్వారా ఎస్జీటీలతో సుమారు 70 శాతం ఖాళీలను భర్తీ చేస్తారు. మిగిలిన 30 శాతం నేరుగా ఉద్యోగంలోకి తీసుకోవడం జరుగుతుంది. ప్రమోషన్స్‌ విషయంలో కొంచెంన్యాయపమైన ఇబ్బందులు ఉండడంతో ఎస్‌ఏ పోస్టుల పై ఓ నిర్ణయానికి రాలేకపోతున్నారు. కాబట్టి 1500-2000 వరకు ఎస్‌ఏ పోస్టులను నేరుగా డీఎస్సీ ద్వారా చేపట్టే వీలున్నట్లు తెలుస్తుంది.

గతంలో ప్రకటించిన డీఎస్సీకి 1,77,502 దరఖాస్తులు వచ్చాయి. ఈసారి పోస్టులు పెరగడంతో భారీగా దరఖాస్తులు వచ్చే వీలుందని అధికారులు అంచనా వేస్తున్నారు. రాష్ట్రంలో డీఎస్సీ పై చాలా మంది నిరుద్యోగులు చాలా ఆశలు పెట్టుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 4 లక్షల మంది టెట్‌ ఉత్తీర్ణత పొందారు.

దీంతో డీఎస్సీ కోసం ఎదురుచూస్తున్నారు.దీంతో అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు. ప్రశ్నపత్రాలతో పాటు రిజల్ట్స్ వరకూ మొత్తం సాంకేతికతనే ఉపయోగిస్తున్నట్లు అధికారులు ప్రకటించారు.

Also read: డబ్బింగ్‌ చిత్రంతో తెలుగు పరిశ్రమకి ఎంట్రీ ఇస్తున్న జక్కన్న కొడుకు!

#dsc #telangana #notification #tet #jobs
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి